ఆయుర్వేదం అనేది భారతీయుల మూలల్లోనే ఉంది. కాకపోతే ఈ మధ్య ఇంగ్లీష్ మందులు ఎక్కువగా రావటం, ఆయుర్వేద వైద్యం చేసేవాళ్లు తగ్గిపోవటంతో మన పురాతన వైద్యం కొంచం వెనుక పడిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడిప్పుడే మన భారతీయులు ఆయుర్వేదం వైపు మళ్లుతున్నట్లు నివేదికలు చెపుతున్నాయి. దీనితో మన ఆయుర్వేదంలో ఉపయోగించే అనేక రకాలైన మొక్కలను మీకు పరిచయం చేస్తుంది.. ది తెలుగు న్యూస్..పైన కనిపిస్తున్న ఆకూ యొక్క శాస్త్రీయనామం కొక్యులస్ హెర్తికాస్.. దీనిని తెలుగులో దూసర తీగ, సిబ్బి తీగ,చిపిరి తీగ అని పిలుస్తారు. సంసృతంలో పాపాల గరిడి అని కూడా పిలుస్తారు.. ఎక్కువగా పొలాల్లో దొరికే ఈ ఆకూ దొండ ఆకులూ మాదిరి ఉంటాయి.
ఈ మొక్కను సరైన పద్దతిలో వాడితే అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రోజుల్లో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరు నరాలు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. అదే విధంగా శరీరానికి మించిన అధిక వేడి వలన కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి వాటికీ ఈ తీగ ఆకులూ బాగా పనిచేస్తాయి.వేసవి కాలంలో పిల్లలకు అనేక శరీర సంబంధిత వ్యాధులు వస్తుంటాయి. బయట ఎక్కువగా తిరగటం వలన ఒంట్లో వేడి పెరగటమే కాకుండా, మూత్రం మంటగా రావటం, ముక్కులో నుండి రక్తం కారడం లాంటివి జరుగుతుంటాయి. అదే విధంగా పెద్దవాళ్ళు కూడా ఎండలో తిరగటం, పొలాల్లో పనిచేసి రావటం మూలంగా ఎండదెబ్బ తగిలి మలమూత్రంలో రక్తస్రావం జరిగే అవకాశం ఉంది.వీటిని నిరోధించటానికి ఈ తీగ ఆకులూ తీసుకోని శుభ్రంగా కడిగి, కొద్దీ నీటిలో వీటిని వేసి బాగా రసం వచ్చేవరకు నలిపి, ఆ తర్వాత దానిలోని వ్యర్దాలను తీసేసి ఆ రసాన్ని పది పదిహేను నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
దీనితో అది జెల్ లాగా తయారు అవుతుంది. దానిలో పటిక బెల్లం కానీ తాటి బెల్లం కానీ కలిపి తినాలి. ఇలా తినటం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా తొలిగిపోతాయి. సంతానలేమి సమస్య ఉన్నవాళ్లు ఈ రసం తీసుకోవటం వలన గర్భాశయ సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది.ఈ ఆకూ రసాన్ని 3 రోజులు క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలో ఇన్ బాలన్స్ గా ఉండే హార్మోన్స్ ను సరిచేస్తుంది. నెలసరి సమస్యలు ఉన్నవారికి రెగ్యులర్ అయ్యేందుకు సహాయ పడుతుంది. ఎండాకాలంలో వచ్చే వేడి కురుపులకు ఈ ఆకు రసం తీసుకోవటం వలన మంచి ఫలితం ఉంటుంది. ఇవి ఎక్కువగా అందుబాటులో లేనివాళ్లు, ఈ ఆకులూ ఎప్పుడైనా దొరికినప్పుడు, వాటిని నీటిలో కడిగి ఎండబెట్టి, వాటిని పొడిగా చేసుకొని ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఈ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.