కరోనా తరువాత 2022 లో ఏమి జరుగుతుంది..? బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఏం చెప్పారు….

పూర్వకాలంలో అనేకమంది సిద్ధ పురుషులు భవిష్యత్తులో జరగబోయేటటువంటి, ఘటన గురించి తమ దివ్య దృష్టితో ముందు గానే ఊహించి చెప్పారు. అలాంటి వారిలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు చాలా గొప్పవారు అని చెప్పవచ్చు.మధ్యయుగంలో తెలుగు నాడు జీవించిన తన దివ్య దృష్టితో ఎంతోమంది మన్నలను పొందారు, ఆయన కాలజ్ఞానం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆయన చెప్పిన ఎన్నో విషయాలు నేటికీ కూడా జరుగుతూ వస్తున్నాయి.పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు భవిష్యత్తులో జరగబోయే విషయాలు ముందుగానే గ్రహించి, తాళపత్ర గ్రంధాలలో రచించి, భద్రపరచడం జరిగింది. ప్రస్తుతం జరిగిన చాలా సంఘటనలను ఆయన ముందుగానే చెప్పడం జరిగింది.

మరి ఆ సంఘటనలు ఏమిటో తెలుసుకుందామా? వీరబ్రహ్మేంద్రస్వామి వారు 17వ శతాబ్దానికి చెందిన యోగి, 1608 నుంచి 1693 వద్ద కాలానికి చెందినవారు, ఆయన కుల మతాలకు అతీతంగా ఎన్నో విషయాలు చెప్పిన దివ్య పురుషుడు. బ్రహ్మంగారి గురించి తెలియని వారంటూ ఉండరు. అంతటి గొప్ప జ్ఞాని ఆ కాలంలోనే ఈ కాలంలో ఏం జరిగిందో ఊహించి చెప్పడం జరిగింది.అందుకే తన కాలజ్ఞానంలో వాటి గురించి ప్రస్తావించారు, మరి ఆయన చెప్పిన విషయాలు ఇప్పటికీ ఎన్నో జరిగాయి, నీళ్లతో విద్యుత్ దీపాలు వెలిగిస్తారు అని చెప్పారు, అంటే మనం కరెంటు బుగ్గలను వాడుతున్నాము. అయితే అలాగే ఎద్దులు లేకుండా బండ్లు నడిపిస్తారని చెప్పా,రు అంటే మనం ఎన్నో వాహనాలను నడుపుతున్నాము. కాశీపట్నం 40 రోజులు పాడుబడుతుంది అని చెప్పారు.

వీధి బొమ్మలు రంగులు పూసుకొని రాజ్యమేలుతారు, అంటే సినిమా యాక్టర్లు ఎంతో మంది రాజకీయాల్లోకి వచ్చారు రాణిస్తున్నారు. రాచరికలు రాజులు రాజ్యాలు కూలిపోతాయి, ప్రభుత్వాలు ఏర్పడతాయి అని చెప్పారు. జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని చెప్పారు, అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా జనాభా పెరుగుతుందో, దేవత విగ్రహాలు దొంగలించబడతాయి కానీ చావు పుట్టకలు మాత్రం కనిపెట్టలేరు, సృష్టిని మార్చడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు, రావణ కాష్టం కల్లోలాలు రేగి దేశాన్ని అల్లకల్లోల పరుస్తాయి, రావణ రాజ్యం ఎక్కడ శ్రీలంకలో అనేక తీవ్రవాద ప్రాలభ్యం ఏర్పడి అనేక నష్టాలు జరిగాయి. గట్టివాడైన పొట్టి వాడు ఒకడు దేశాన్ని పాలిస్తాడు అని చెబుతాడు.

అంటే లాల్ బహదూర్ శాస్త్రి అనుకోవచ్చు. కపట యోగులో చాలామంది పెరిగిపోతారు, వీరి వల్ల దేశానికి చాలా ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు, కానీ మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తూనే ఉన్నాము అడవి మృగాలు గ్రామాలు, పట్టణాలు ప్రవేశించి మానవులను చంపుతున్న చంపుతుంది అని చెప్పారు.ఇది కూడా నిజం అవుతుంది కదా మనం ఇప్పటికే చూస్తూనే ఉన్నాము అడవులను నరికి వేసి, గ్రామాలు పట్టణాలను నిర్మించుకుంటున్నాము అడవి జంతువులు ఉండే ఆవాసాన్ని మనం నాశనం చేస్తున్న, ఇవన్నీ కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు అవి జరుగుతున్నాయి. భవిష్యత్తులో ఏమి జరుగుతుందో బ్రహ్మంగారు చెప్పారు, అదేంటంటే తిరుపతిలో శ్రీవారి కుడి భుజం పగులుతుంది అని చెప్పారు. ఈశాన్య దిక్కున విషవాయువుతో ఎంతోమంది చనిపోతారు అని ఆయన చెప్పారు. 2024 నాటికి ఆకాశంలో కొత్త నక్షత్రం ఉద్భవిస్తుందాన్ని తన కాలజ్ఞానంలో చెప్పారు.