బ్రెస్ట్ కేన్సర్ తో పోరాడుతున్న మిర్చి బ్యూటీ.. వైరల్ అవుతున్న ఎమోషనల్ ట్వీట్ ..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా

టాలీవుడ్ లో హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, ఐటెం గర్ల్ గా పలు సినిమాల్లో నటించిన హంసానందిని అనతికాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన విషయాలను, లేటెస్ట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ట్విట్టర్ వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ ని షేర్ చేసింది. తను క్యాన్సర్ తో పోరాడుతున్నానని చెప్పి ప్రేక్షకులకి షాకిచ్చింది హంసానందిని. అంతేకాదు.. కీమోథెరపీ కారణంగా జుట్టు మొత్తం కోల్పోయి గుండుతో కనిపించింది హంసానందిని. ఊహించని ఈ వార్తతో సినీ వర్గాలు ఆశ్చర్యం వ్యటం చేస్తున్నాయి.

నాలుగు నెలల క్రితం తన బ్రెస్ట్ లో లంప్ ఉన్నట్లుగా గుర్తించిన హంసానందిని వెంటనే వైద్యులని కలిసి పలు టెస్ట్ లు చేయించుకుందట. అందులో తనకు బ్రెస్ట్ క్యాన్సర్ అని తేలిందట. డాక్టర్స్ బయోప్సీ చేయాలని చెప్పడంతో ట్రీట్మెంట్ తీసుకుందట. కొన్నేళ్ల క్రితం తన తల్లి కూడా క్యాన్సర్ తో చనిపోయిందని.. అప్పటిరోజులు గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఎంతో బాధగా ఉంటుందని.. ఇప్పుడు తనకు కూడా క్యాన్సర్ వచ్చిందని ఎమోషనల్ అయింది హంసానందిని. కానీ తను భయపడడం లేదని.. క్యాన్సర్ తో పోరాడి గెలుస్తానని నమ్మకంగా చెబుతోంది. ప్రస్తుతం తాను క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నానని.. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగివస్తానని ధీమా వ్యక్తంచేశారు. తన జీవితంలో కాలం ఏవిధమైన ప్రభావాలు చూపినా.. బాధితురాలిగా ఉండాలనుకోవడం లేదన్నారు హంస.ట్రీట్మెంట్ లో భాగంగా కీమోథెరపీ, రేడియేషన్ చేయించుకోవాల్సి ఉందని చెప్పింది.

తనకొచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్ పూర్తిగా నయమయ్యే అవకాశాలు తక్కువ అని.. ఫ్యూచర్ లో మళ్లీ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పింది. కాబట్టి మరో మూడేళ్లపాటు ట్రీట్మెంట్ ను కొనసాగించాల్సి ఉంటుందని తెలిపింది. జన్యుపరమైన క్యాన్సర్‌ ఉన్నట్లు వైద్యులు తాజాగా నిర్ధారించారని వివరించారు. ప్రస్తుతానికి 9 విడతల కిమోథెరపీలు చేయించుకున్నానని.. మరో ఏడు చేయించుకోవాల్సి ఉందన్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో మళ్లీ మీ ముందుకు వస్తానని అభిమానులకు తెలిపారు.అంతేగాక క్యాన్సర్‌ను జయించి పూర్తి ఆరోగ్యంతో తిరిగి సినిమాల్లో నటిస్తానంటూ ఆమె ధీమా వ్యక్తం చేసింది. హంసానందిని త్వరలోనే కోలుకుని తిరిగి ప్రేక్షకుల ముందుకు రావాలని మనస్పూర్తిగా కోరుకుందాం.