గత కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. స్టార్ హీరోలు, దర్శక, నిర్మాతలు ఇతర సాంకేతిక వర్గానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారు.
ఇటీవల ఏఐజీ హాస్పిటల్ చేరిన తల్లి ఇందిరాదేవిని మహేష్ బాబు పలుమార్లు పరామర్శించారు. సూపర్ స్టార్ కృష్ణ విడిపోయి విజయనిర్మలని పెళ్లి చేసుకున్న తర్వాత ఇందిరాదేవి ఒంటరిగానే ఉంటున్నారు. ఇందిరాదేవికి ఐదుగురు సంతానం. రమేష్ బాబు, మహేష్ బాబు, పద్మావతి, మంజుల, ప్రియదర్శిని. కుటుంబ సభ్యులు ఆమెను తరచుగా కలుస్తూ ఉంటారు. ఇందిరాదేవి మరణంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.