హరిహర కృష్ణతో కలిసి ఘటనా స్థలంలో నవీన్ మృతదేహాన్ని చూసిన ప్రియురాలు!

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉంది అంటే అది అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య అనే చెప్పాలి. ఈ క్రమంలోనే నవీన్ హత్య కేసులో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన కేసు ఏదైనా ఉంది అంటే అది అబ్దుల్లాపూర్ మెట్ లో జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య అనే చెప్పాలి. స్నేహితుడి చేతిలో నవీన్ అతి దారుణంగా హత్య చేయబడ్డాడు.ఈ క్రమంలోనే నవీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. హరి తన ప్రియురాలు నిహారికారెడ్డి కోసమే నవీన్ ను హత్య చేసినట్లు పోలీసులు నిర్దారించారు.

దాంతో ఈ కేసులో ఏ1 హరిహారకృష్ణ, ఏ2గా హసన్, ఏ3గా హరి ప్రియురాలిని చేర్చారు పోలీసులు.నవీన్ హత్యకు సంబంధించిన సంచలన విషయాలను పోలీసులు తాజాగా వెల్లడించారు. అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర జరిగిన బీటెక్ స్టూడెంట్ నవీన్ హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ వెల్లడించారు. డీసీపీ సోమవారం మీడియాతో మాట్లాడుతూ..”హరిహరకృష్ణ ఫిబ్రవరి 17న పార్టీ పేరుతో నవీన్ ను అబ్దుల్లాపూర్ మెట్ లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత నవీన్ ను హత్య చేసి, అతడి తల,గుండె, చేతి వేళ్లు, మర్మాంగాలను కట్ చేశాడు హరిహర. ఆ భాగాలను సంచిలో వేసుకుని బైక్ పై బ్రాహ్మణపల్లిలోని స్నేహితుడు హసన్ ఇంటికి వెళ్లాడు.

అనంతరం ఆ భాగాలను హాసన్ తో కలిసి మన్నెగూడ ప్రాంతంలో పడేశారు. ఆ తర్వాత హసన్ ఇంటికి చేరుకుని దుస్తులు మార్చుకుని నైట్ అక్కడే ఉన్నాడు నవీన్. “ఆ తర్వాత ఉదయాన్నే బీఎన్ రెడ్డి నగర్ లో ఉండే తన ప్రియురాలు దగ్గరికి వెళ్లి.. నవీన్ ను హత్య చేసిన విషయం చెప్పాడు హరి. అనంతరం కర్చుల కోసం రూ. 1500 ఆమె వద్ద తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 20వ తేదీ సాయంత్ర మరోసారి ప్రియురాలి ఇంటికి వెళ్లి, ఆమెను బైక్ పై ఎక్కించుకుని నవీన్ ను హత్య చేసిన ప్రాంతానికి తీసుకెళ్లాడు. కొద్ది దూరం నుంచి తన ప్రియురాలికి నవీన్ మృతదేహాన్ని చూపించాడు హరిహరకృష్ణ. ఆ తర్వాత ఆమెను ఇంటి వద్ద దింపి పలు ప్రదేశాల్లో తప్పించుకుతిరిగాడు” అని డీసీపీ సాయి శ్రీ తెలిపారు.