హీరాబెన్ అంతిమ యాత్ర.. తల్లి పాడె మోసిన ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన మాతృమూర్తి హీరాబెన్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మోదీ మాతృమూర్తి.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. తల్లి మరణంతో ప్రధాని మోదీ కన్నీటి పర్యంతమయ్యారు. తన మాతృమూర్తి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగానికి గురయ్యారు.

తల్లికి వీడ్కోలు పలుకుతూ కన్నీటి పర్యంతమయ్యారు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉన్న ఆమె నివాసం నుంచి అంతిమ యాత్ర మొదలైంది. అంతిమ యాత్రలో సోదరులతో కలిసి మోదీ తన మాతృమూర్తి పాడెను మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివదేహం వద్దే కూర్చుని భావోద్వేగానికి గురయ్యారు మోదీ. గాంధీనగర్ లోని స్మశానవాటికలో హీరాబెన్ అంత్యక్రియలు పూర్తి చేశారు. తన సోదరులతో కలిసి మోదీ తల్లి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

తల్లి హీరాబెన్ చితికి నిప్పు అంటించి.. నివాళులు అర్పించారు. హీరాబెన్ ని కడసారి చూసుకుని గాంధీ నగర్ వాసులు కన్నీటి పర్యంతమయ్యారు. తీవ్ర అనారోగ్యం కారణంగా అహ్మదాబాద్ యూఎన్ మెహతా ఆసుపత్రిలో చేరిన హీరాబెన్.. చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున 3.30 నిమిషాలకి మృతి చెందారు. హీరాబెన్ మృతి పట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.