1సారి ఈ టీ తాగండి నరాల బలహీనత, నరాల నొప్పులు,వాపులు,బ్లాకేజ్ సమస్యలు పూర్తిగా మాయంచేస్తుంది

ఒకసారి ఈ టీ తాగండి. నరాల బలహీనత నరాల నొప్పులు, వాపులు, బ్లాకెజె సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. మన శరీరంలో నరాలు ఒక అవయవం నుంచి మరొక అవయవానికి రక్తాన్ని సరఫరా చేయడానికి పనిచేస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే కొన్ని కారణాల వల్ల మన నరాలు బలహీనపడటం దేని వలన మన శరీరంలో ఎన్నో సైడ్ ఎఫెక్ట్ లు రావడం మొదలవుతాయి. ముఖ్యంగా నరాలలో నొప్పులు రావడం జరుగుతూ ఉంటుంది. దీనిని నెర్వ్ పెయిన్ అని కూడా పిలుస్తారు.ఈ రెమీడినీ తయారు చేసుకోవడానికి ముందుగా మనకు కావలసిన పదార్థం దాల్చినచెక్క, దాల్చిన చెక్క కొలెస్ట్రాల్, అధిక బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే షుగర్, దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలు తగ్గించడానికి కూడా దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఇది మన బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్ గా ఉండేటట్లు చేస్తుంది. ఇప్పుడు మనకు కావలసిన రెండవ పదార్థం పెద్ద యాలకులు. వీటిని నల్ల యాలకులు అని కూడా పిలుస్తారు. ఇవి మీకు ఏదైనా ఆయుర్వేదం షాప్ లో సులభంగా లభిస్తాయి.

ఆయుర్వేదంలో వీటిని ఎన్నో ఔషధ తయారీలో ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా హై బీపీ సమస్యను తగ్గించడానికి ఇవి చాలా బాగా సహాయపడుతాయి. ఆయుర్వేదంలో ఈ నల్ల యాలకులను లివర్ కు సంబంధించిన వ్యాధులు తగ్గించడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు దీనితో బాటు మనకు కావాల్సిన మరో పదార్థం లవంగాలు. లవంగాలలో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. దీని వల్ల ఇది మన శరీరంలో వచ్చే ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. లవంగాలను ఉపయోగించే సరైన పద్ధతి ని తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే,అనేక రకాల వ్యాధులకు అనేక విధాలుగా ఉపయోగించాలి. నరాలకు సంబంధించిన వ్యాధులు తగ్గడానికి లవంగాలను ఏవిధంగా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం. దీనివల్ల మలబద్ధకం, అజీర్ణం, డైజేషన్ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఇదే కాకుండా డయాబెటిక్ సమస్యను నివారించడానికి చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తాయి. అందుకే షుగర్ సమస్య ఉన్నవాళ్లు లవంగాలను తప్పకుండా ఉపయోగించండి.

దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది. లవంగాల లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పాస్పరస్, పొటాషియం, సోడియం మరియు ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ పోషక విలువలు నరాలను బలంగా చేస్తాయి. మరియు బ్లడ్ సర్కులేషన్ ను కంట్రోల్లో ఉండేలా చేస్తాయి. ఈ మూడు పదార్థాలను ఉపయోగించి మనం ఒక కషాయాన్ని తయారు చేసుకోవాలి.దీని కోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి గ్యాస్ లో ఫ్లేమ్ లో ఉంచి, అందులో ఒక గ్లాసు నీళ్ళు పోయాలి. ముందుగా దీనిలో మనం దాల్చినచెక్క పొడిని వేయాలి, ఒక పావు స్పూను దాల్చినచెక్క పొడిని నీళ్లలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద యాలుక మరియు రెండు లవంగాలను తీసుకొని వాటిని మెత్తగా దంచుకొని ఆ తర్వాత లవంగాలను నీళ్లలో వేయాలి. ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో వీటన్నింటిని నీళ్ళలో బాగా కలిపి, ఈ నీళ్లను 5 నుంచి 7 నిమిషాలు బాగా మరగనివ్వాలి. గ్యాస్ లో ప్లేమ్ మీద ఉంచి మాత్రమే ఈ నీటిని మరిగించుకోవాలి. దీనివల్ల మెల్ల మెల్లగా వీటన్నింటిలో ఉండే ఔషధ గుణాలు నీళ్ళలోకి వచ్చేస్తాయి. ఈ నీరు బాగా మసిలిన తరవాత కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం శరీరానికి చాలా మంచి చేస్తుంది.