బ‌స్సులో టీష‌ర్ట్, జీన్స్ వేసుకోవ‌ద్దంటూ స‌జ్జనార్ కీలక ఆదేశాలు.. అందరు షాక్

VC Sajjanar : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ( టీఎస్ఆర్టీసీ )  కీలక నిర్ణయాలు తీసుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. తెలంగాణ బస్సులలో ప్రతిరోజు వేలాది మంది ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి చేరుతుంటారు. అయితే.. తెలంగాణ సర్కారు బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించ‌డం మనం చూశాం. బస్సులో ఉచిత ప్రయాణాలలో అనుకోనిరీతిలో ఆదరణ లభిస్తుంది. కొన్ని రూట్ లలో బస్సుల కొరత వల్ల గొడవలు కూడా జరుగుతున్నాయి. బస్సులలో కొందరు చిల్లర కోసం, ఆర్టీసీ, డ్రైవర్ లతో గొడవలు పడిన ఘటనలు క‌డూఆ వెలుగులోకి వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో బస్సుల సంఖ్యను పెంచడానికి కూడా ఆర్టీసీ చైర్మన్ సజ్జనార్ ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేశారు.

VC Sajjanar మంచి నిర్ణ‌యం

తాజాగా ఆర్టీసీ అధికారులు, ఆర్టీసీ పరిధిలో పని చేసే ఇతర సిబ్బంది టీ షర్టులు, జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు హాజరు కాకూడదని ఆదేశాలు జారీ చేసింది. కాగా కొందరు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది టీ షర్టులు,జీన్స్ ప్యాంట్లు ధరించి విధులకు వస్తున్నారని, ఆ తరహా వస్త్రధారణ సంస్థ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉందంటూ ఆర్టీసీ సంస్థ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంది. సిబ్బంది, అధికారులు ఎవ‌రైన సరే యూనిఫాం లేదంటే ఫార్మల్ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ సూచించారు. సజ్జ‌నార్ తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల స‌ర్వాత్రా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తుంది.

ఇక ఈనెల 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. అటు ఏపీలో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్న ఓటర్లు ఏపీకి పెద్ద సంఖ్యలో బ‌య‌లుదేరుతున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో రాకపోకలు సాగించేందుకు 450 ఆర్టీసీ బస్సులో ఇప్పటికే రిజర్వేషన్లు పూర్తి అయినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఇక ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సంస్థ 2 వేల ప్రత్యేక బస్సులను నడుపుతున్న‌ట్టు తెలియ‌జేశారు.. ఎంజీబీస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీ నగర్ నుంచి 200 ప్రత్యేక బస్సులను నడపనునట్టు అధికారులు తెలిపారు.