అనసూయ కోసం రంగం లోకి దిగిన రోజా….

ప్రముఖ టీవీ యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యాంకరింగ్ తో పాటు వరస సినిమా ఆఫర్లు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పదమైన న్యూస్ తో నిలిచే అనసూయ గుక్క పెట్టి ఏడ్చింది. రీసెంట్ గా అనసూయ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నేటితో వైరల్ గా మారింది. కారణం ఏంటనేది తెలియదు, కానీ అనసూయ ఏడ్చే వీడియో మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అనసూయ పైకి మాత్రం స్ట్రాంగ్ లేడీ గా కనిపిస్తూ లోపల ఇంత బాధ ఎందుకు అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అసలు ఎందుకు ఏడుస్తోంది ఏం జరిగింది అనేది మాత్రం సస్పెన్స్ ఉండడంతో, అనసూయ ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు.

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ వల్లనో, లేక ఎవరైనా ఆంటీ అని పిలవడం వలన హర్ట్ అయ్యి ఉంటుందని అనుకుంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ అనసూయ ఏడుస్తుంటే తట్టుకోలేని ఫ్యాన్స్ ఉన్నారని తెలుస్తోంది. ఈ వీడియో క్షణాల్లో వైరల్ అవుతూ ఉండడంతో అనసూయ కి మద్దతుగా నిలుస్తూ ధైర్యం ఇస్తున్నారు ఫ్యాన్స్. ఆ మధ్యన అనసూయ పట్ల కొంతమంది నెటిజెన్స్ అన్నందుకు అనసూయ రిప్లై ఇస్తూ, దయచేసి మీరు మీ పనిని చూసుకోండి నన్ను నా పనిని చేసుకోనివ్వండి, మీరు ఇలా ఆలోచించి మగ జాతి పరువు తీస్తున్నారు. అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే, అయితే డ్రెస్సింగ్ విషయంలో తరచూ నెటిజెన్స్ నుండి ఆమె విమర్శలు ఎదుర్కొంటున్నారు.

అయితే తాజాగా అనసూయ పెట్టిన వీడియో చూసిన మంత్రి రోజా ఒక్కసారిగా షా క్ కి గురయ్యారట. వెంటనే ఈ విషయం గురించి అనసూయకు ఫోన్ చేసి కనుక్కున్నట్టు సమాచారం. అసలు నిన్ను ఎవరు ఇబ్బంది పెడుతున్నారు, నాకు చెప్పు వాడి సంగతి నేను చూసుకుంటా అని మంత్రి రోజా అనసూయ కి ధైర్యం చెప్పినట్టు సమాచారం. ఆమెకే ఫోన్ చేసి సపోర్టివ్ గా మాట్లాడుతూ, ఇంటర్నెట్లో ఇలాంటి నెగెటివిటీ చాలా కామన్ ఇవన్నీ మనం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, నీ ఫ్యామిలీ పిల్లలతో లైఫ్ ఎంజాయ్ చేయి ఎక్కువ సమయం కుటుంబంతో గడుపు, అప్పుడు నీ డిప్రెషన్ మొత్తం పోయి చిల్ అవుతావని అనసూయ కి ధైర్యం చెప్పినట్టు సమాచారం.