ఈ కాయిన్స్ మీ వద్ద ఉన్నాయా..? ఒక్కోటీ రూ.25 లక్షలు. ఇక్కడ అమ్మేయండి.

ప్రపంచంలో ఔత్సాహికులకు కొరత లేదు. చాలా మందికి పురాతన వస్తువులను సేకరించడం ఇష్టం. చాలా మంది పాత, అరుదైన నాణేలను సేకరించడానికి ఇష్టపడతారు. అలాంటి నాణేల కోసం అధిక ధరలను చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అందుకే.. మీ దగ్గర అలాంటి అరుదైన నాణేలు ఉంటే మీరు కూడా ధనవంతులు కావచ్చు. అయితే మీ దగ్గర ఉన్న రూ.5 లేదా రూ.10 కాయిన్లపై వైష్ణోదేవి బొమ్మ ఉంటే… అలాంటి కాయిన్లకు ఈ-కామర్స్ సైట్లలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అలాంటి కాయిన్ మీ దగ్గర ఒక్కటి ఉన్నా చాలు… మీరు క్షణాల్లో లక్షాధికారి అవుతారు. వైష్ణోదేవి ప్రధాన ఆలయం జమ్మూకాశ్మీర్‌లోని కత్రాలో ఉంది.

ఈ అమ్మవారి ఫొటోలతో ఉన్న కాయిన్లను కేంద్ర ప్రభుత్వం 2002లో ముద్రింపజేసింది. ఈ కాయిన్ తమ దగ్గర ఉంటే… అష్టైశ్వర్యాలూ తమతో ఉంటాయని చాలా మంది నమ్ముతున్నారు. దీన్ని కొనేందుకు రెడీగా ఉన్నారు. అందువల్ల దీనికి విపరీతమైన డిమాండ్ ఉంది. కానీ అమ్మేవారే కనిపించట్లేదు. మీ దగ్గర ఇలాంటి కాయిన్ ఉంటే… మీరు ఆన్‌లైన్‌లో వేలం వేసి అత్యధిక ధరకు అమ్ముకోవచ్చు. 1913లో విడుదలైన రూపాయి నాణేలకు కూడా డిమాండ్ చాలా ఉంది. మీ దగ్గర అలాంటి రూపాయి ఉంటే… మీరు ఈజీగా రూ.25 లక్షలు సంపాదించగలరు. అప్పట్లో నాణేలను వెండి తో తయారుచేసేవాళ్లు. అలాంటి రూపాయిని ప్రస్తుతం విక్టోరియా కేటగిరీలో చేర్చారు.

ఫలితంగా డిమాండ్ బాగా పెరిగింది. కానీ అలాంటి రూపాయలు ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అమ్ముకునే ముందు మీరు మీ ప్రొఫైల్ క్రియేట్ చెయ్యాల్సి ఉంటుంది. ఇండియా మార్ట్ వెబ్‌సైట్‌లో చాలా మంది పాత నాణేల కోసం ఎదురు చూస్తున్నారు. ఇందులో అమ్ముకోవడానికి ముందుగా మీరు సైట్‌లో లాగిన్ ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ఈజీయే. ఐడీ ద్వారా లాగిన్ అయ్యి… మీ దగ్గరున్న కాయిన్ ఫొటోలను అప్‌లోడ్ చెయ్యాలి. మీ మొబైల్ నంబర్ ఇవ్వాలి. తద్వారా ఎవరికైనా నాణేలు కావాలంటే మీకు కాల్ చేసి కొనుక్కుంటారు. అంతే సో ఈజీ.