దీపావళి రోజు ఉప్పు, ఒక రూపాయితో ఇలా చేయండి.. కోటీశ్వరులు అవుతారు..!!

Diwali Festival : డబ్బు సంపాదించడానికి, డబ్బు దాచి పెట్టడానికి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. కొంతమంది ఎంత కష్టపడ్డా ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు. లక్ష్మీ కటాక్షం లేక ఆర్థిక సమస్యలు వస్తాయి. అయితే అలా అవ్వకుండా ఉండాలంటే దీపావళి రోజున కచ్చితంగా ఈ పరిహారాన్ని చేయాలి. ఉప్పుతో చేసే పరిహారం ఎంతో విశిష్టమైనది. ఈ పరిహారం చేశాక ఇంట్లో కొన్ని నియమ నిష్టలు పాటించాల్సి ఉంటుంది. ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.ఇంటిని, గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. ఇంట్లోనే ఆడవాళ్ళని ఎప్పుడు గౌరవించాలి. అప్పుడే ఇంట్లో మీరు ఎప్పుడు సంతోషంగా ఉంటారు.

ఇంట్లో ఎప్పుడు గొడవలు పెట్టుకోకూదు. లక్ష్మీదేవి ఇంట్లోకి రాదు. లక్ష్మీదేవి అని భావించే ఎన్నో రకాల వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కింద పడేయటం కాళ్లతో తొక్కడం కానీ చేయకూడదు. ముఖ్యంగా పువ్వులు, రూపాయి కాసులు ఎలా పడితే అలా వేయకూడదు. వీటిని జాగ్రత్తగా ఉంచుకోవాలి. చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు. అలాంటి దానిని ఎక్కడపడితే అక్కడ వేయడం, తొక్కడం చేయకూడదు.ఇకపోతే భక్తిశ్రద్ధలతో ఉప్పుతో కనుక పరిహారాన్ని చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఒక మట్టి పాత్ర కానీ లేదా గాజు పాత్ర కానీ తీసుకొని అందులో నిండుగా గళ్ళు ఉప్పుని వేయాలి. దానిపై పసుపు కుంకుమ వేసి వాటిపై ఒక రూపాయి కాయిన్ ను ఉంచాలి. దీనిని ఈశాన్య మూలలో ఉంచాలి. ముఖ్యంగా ఈ పాత్రను గ్యాస్ స్టవ్ వద్ద ఎడమవైపున పెట్టాలి.

ఇలా పెట్టడం వలన ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ పోతుంది. ఈ పరిహారాన్ని మనస్ఫూర్తిగా చేయాలి. నమ్మకాన్ని ఉంచాలి. ఈశాన్యం ఉంచిన తర్వాత సంకల్పాన్ని చెప్పుకోవాలి. ఆర్థిక సమస్యలు ఉండకూడదు అని కోరుకోవాలి.ఇక ఈ పాత్రను వారం రోజుల తర్వాత రంగు మారాక తీసేయాలి. మంగళవారం, శుక్రవారం అస్సలు తీయకూడదు అయితే రంగు ముదురు ఆకు రంగు మారితేనా పాత్రను తీసివేయాలి. ఇక ఈ ఉప్పును ఇంటి నుంచి దూరంగా పారేయాలి. ఇంటికి దగ్గరలో మాత్రం అసలు వేయకూడదు. అయితే అందులో ఉండే రూపాయి కాయిన్ మాత్రం తులసి చెట్టులో వేయాలి. దీపావళి రోజున ఈ పరిహారం చేయడం వలన తప్పకుండా కోటీశ్వరులు అవుతారు.