నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసా..? అలా తింటే అనారోగ్యం తప్పదు..!!

వర్షాకాలంలో వచ్చే పండు నేరేడు పండు చూడటానికి పర్పుల్ కలర్ లో చాలా వెరైటీగా డిఫరెంట్ గా కనిపించే పండ్లు నేరేడు.. దీని టేస్ట్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వర్షాకాలంలో వచ్చే రకరకాల రోగాల నుంచి ఇట్టే కాపాడుతుంది. షుగర్ వ్యాధితో బాధపడే వారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. నేరుడు రోజు తింటే రక్తంలోని చక్కర శాతం కంట్రోల్ లోకి వస్తుంది. నేరేడు గింజల పొడిని నీటితో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి షుగర్ లెవెల్స్ తగ్గుతుంది.

నేరేడు పండు లాగానే దీని ఆకులు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలు తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి. ఈ నేరేడు పండులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, ఫాస్ఫరస్, జింక్ , విటమిన్ లతోపాటు క్లినిక్ పోలిక్ యాసిడ్లు ఫుల్ గా ఉంటాయి. ఇది అధిక రక్తపోటు సమస్యను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే అధికంగా తీసుకుంటే మలబద్ధకం సమస్యతో పాటు నోట్లో వేగట్టుగా కూడా ఉంటుంది. నేరేడు పండ్లను ఎలా తినకూడదో తెలుసుకుందాం.. నేరేడు పండు ఈ పండు అనేక ఔషధ ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. అయితే వీటిని తినడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి.

ఎలా పడితే అలా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఖాళీ కడుపుతో నేరేడు పండ్లను తీసుకోకూడదు. నేరేడు పండ్లను తిన్న తర్వాత మంచి నీళ్లు తాగకూడదు.అలాగే నేరేడు పళ్ళు తిన్న తర్వాత పసుపు వేసిన పదార్థాలను ఎప్పుడూ తినకూడదు. అలాగే నేరేడు పండు తిన్న తర్వాత పాలు తాగకూడదు. ఈ పండు తిన్న తర్వాత పచ్చళ్ళు ఎప్పుడు తినకూడదు.ఎక్కువగా నేరేడు పండ్లను తింటే జ్వరం, శరీర నొప్పి, గొంతు సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. నేరేడు పండ్లు ఎక్కువగా తినడం వల్ల మొటిమలు కూడా వస్తాయి. నేరేడు పండ్లు మితంగా తీసుకుంటే రక్తపోటు కూడా తగ్గుతుంది. భోజనం తర్వాత నేరేడు పండ్లు తినడం వలన జీవక్రియ వేగవంతం అవుతుంది.