రాత్రిపూట పండ్లను తింటే ప్రమాదమేనా..?

చాలామంది రాత్రిపూట ఆహారం తీసుకున్న తర్వాత పండ్లను తింటూ ఉంటారు. అయితే కొంతమందికి రాత్రిపూట పండ్లను తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. అయితే పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ టైంలో తీసుకోకూడదు అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు అంటున్నారు. ఈ విషయాలు తెలుసుకోకపోతే అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని వారు తెలియజేస్తున్నారు.

మరి పండ్లను ఏ టైంలో తీసుకోవాలి ఏ సమయంలో తీసుకోకూడదు, ఏ పండ్లు తింటే ఆరోగ్యానికి మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. పంటలో విటమిన్స్,యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి ఎక్కువగా ఉంటాయి. నిజానికి పండ్లను తీసుకోవడం వల్ల గుండెజాబ్బులు, క్యాన్సర్ వంటివి కూడా రావు. అయితే ఉదయం పూట పండ్లు తినడం చాలా మంచిది. దీనివల్ల త్వరగా జీర్ణం అవుతుంది.

దీనికి ప్రధాన కారణం అందులో ఉండే పోషక విలువలు మీకు అందుతాయి. ముఖ్యంగా భోజనానికి గంట ముందు తీసుకున్న కూడా మంచిదే. ఏదేమైనా రాత్రిపూట మాత్రం అస్సలు తీసుకోకండి. రాత్రిపూట పండ్లు తింటే జీర్ణ సమస్యలు వస్తాయట. దీనివల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి రాత్రిపూట పండ్లను తినకూడదు.