ఈ పండ్లు తిని గింజలు పడేస్తున్నార..? అయితే ఈ విషయాలు తెలిస్తే అసలు పడేయరు…!!

Health Tips ; మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మన శరీరానికి ఎన్నో పోషకాలు అవసరం. అయితే పోషకాలు అనేది పండ్లలో, కూరగాయలలో ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని పండ్లు తిని వాటి గింజలను పడేస్తూ ఉంటాం.. అయితే గింజలలో ప్రయోజనాలు తెలిస్తే వాటిని ఇకనుంచి పడేయరు.. వాతావరణం చల్లగా ఉన్న ప్రదేశాలలో మాత్రమే డ్రై ఫ్రూట్స్ పండిస్తూ ఉంటారు. అయితే మేర్రి పండ్లు చల్లని వాతావరణం అవసరం లేని డ్రైఫ్రూట్. ఇది బరువు తక్కువ, పరిమాణంలో చిన్నది దీని లక్షణాలు చాలా గొప్పగా ఉంటుంది. ఇది శరీరానికి ఎంతో బలాన్ని చేకూరుతుంది. గుండెను దూరంగా ఉంచుతుంది..

ఈ డ్రై ఫ్రూట్ భారతదేశం ఇండియన్ ఫ్రూట్ అని పిలుస్తారు. ఇది తీపిగా ఉంటుంది.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని గ్రామాలలో మెర్రీ పండ్లు అంటారు. ఈ పండ్లను పగలగొట్టి లోపల ఉన్న గింజల నుంచి చిరొంజిను తీస్తారు. ఈ గింజ నుంచి సిరొంజిని లేదా సార పలుకులు తీయడానికి చాలా కష్టపడవలసి వస్తుంది. ఈ చిరొంజ్ చాలా ఖరీదైన అటవీ ఉత్పత్తి. దాని ధర కూడా చాలా ఎక్కువగా పలుకుతుంది. అడవిలో దొరికే పండ్లు అన్నిట్లో ఇదే అత్యంత ప్రధానమైన డ్రై ఫ్రూట్. మెర్రీ పండ్లు అత్యంత ఖరీదైన అటవీ ఉత్పత్తి దేశంలో తయారయ్యే 70% స్వీట్లలో దీనిని వాడుతూ ఉంటారు. దీని పలుకులు వాడుతూ ఉంటారు.

దీనిని వాడడం వలన ఆ స్వీట్ కి రుచి అధికమవుతూ ఉంటుంది. నిజానికి డ్రై ఫ్రూట్స్ లాగా వాడతారు. దీని వాడకం అనేక వ్యాధులను తగ్గిస్తుంది. చిరొంజ్ గింజలలో 50% కంటే ఎక్కువ నూనె కలిగి ఉంటుంది. దీనిని చిరొంజి ఆయిల్ అంటారు. దీని సౌందర్య వైద్య ప్రయోజనాల కోసం వాడుతూ ఉంటారు. ఇది తెలుగు రాష్ట్రాలలో కూడా పండిస్తూ ఉంటారు. తెలుగు రాష్ట్రాల్లోని అదిలాబాదు శ్రీకాకుళం, విశాఖ ఏజెన్సీ ప్రదేశాలలో బాగా దొరుకుతాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర అడవి ప్రాంతాలలో ఎక్కువగా ఉండే జిల్లాలలో గిరిజన పంటగా మెర్రీ పండ్లను పండిస్తారు.. అడవి ప్రాంతాలలో పెరిగే ఈ చెట్లనుంచి ఈ పండ్లను సేకరిస్తూ ఉంటారు.. అయితే వీటి లోపల ఉండే గింజలలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి..