ఒక్క దెబ్బతో కంటి చూపు పెరిగిపోతుంది….

కంటి చూపు పెరగాలంటే ఎలాంటి న్యాచురల్ పద్ధతులు ఉన్నాయి. వెజిటేబుల్ థెరపీ దీని గురించి ఏం చెబుతుందో వివరాలు తెలుసుకుందాం. కళ్ళు మసకబారడం కంటిచూపు సమస్య కళ్లద్దాలు అయితే, చిన్న వయసు నుండి మనం ఈ ప్రాబ్లంని చూస్తూ ఉన్నాం. చిన్నపిల్లలలో 10 లో 8 మందికి కళ్ళద్దాలు ఉంటున్నాయి. దీనిని కంటి చూపు పెరగాలంటే ఏం చేయాలి. మనం రెగ్యులర్ గా ఒక ఉసిరికాయ తింటే కళ్ళ విషయంలో మార్పు వస్తుంది.

వెజిటేబుల్స్ లో దొండకాయలని క్యారెట్ తో కలిపి ఒక ఉసిరికాయ వేసి జ్యూస్ చేసుకుని తాగితే ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఉసిరికాయ లేదా మామిడికాయ లేదా నిమ్మకాయ పులుపు అనేది రుచి ప్రధానం ఇందులో ఉప్పు అల్లం వేయకూడదు. నోట్లో పెట్టుకుని చప్పరిస్తూ తాగాలి రెగ్యులర్గా చేయడం వల్ల సమస్య చిన్నగా ఉంటే వారం పది రోజులలో మార్పు కనిపిస్తుంది. సమస్య పెద్దదిగా ఉంటే మూడు నుండి ఆరు నెలల లోపు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. సప్తలోహ గోగులని టాబ్లెట్స్ మనకు మార్కెట్లో ఆయుర్వేదంలో దొరుకుతాయి.

ఉదయం రెండు సాయంత్రం రెండు వేసుకోవాలి ఇలా వేసుకుంటూ నేత్ర బిందువు అని అలసిపోయిన కళ్ళకి విశ్రాంతిని ఇవ్వాలి. మనం చేసిన పొరపాటు ఏంటంటే పడుకోవలసిన సమయాన్ని సెల్ఫోన్లో చూస్తూ కాలయాపన చేస్తూ నిద్ర సరిగా లేకపోవడం వల్ల, నిద్ర చాలా అవసరం. కళ్ళకి చల్వ చేయాలి కాబట్టి మారేడు దళాలను కంటిమీద పెట్టి, నల్లటి క్లాత్ కట్టుకుంటే చాలా వరకు రిలాక్స్ ఉంటుంది. ఇది మల్లెపూల సీజన్ మల్లెపూలు కూడా తొడిమెలు తీసేసి ఒక పలుచటి క్లాత్ వేసి దానిమీద మల్లెపూలు పెట్టి, కళ్ళకి గంటల్లాగా కట్టుకొని పడుకున్న, ఆ కంటిలో ఉన్నటువంటి వేడి లాగేస్తుంది,చూపు పెరగడానికి అవకాశం ఉంటుంది. చదువుకునే పిల్లలకి ఇది చాలా అవసరం.