ఆగస్టు నెలలో కుంభ రాశి వారికి అద్భుతం జరగబోతుంది…!

ఆగస్టు మాసంలో కుంభ రాశి వారికి అదృష్టం వరించబోతుంది. నక్కతోక తొక్కినట్లుగా ఒక అద్భుతం జరగబోతుంది. అయితే ఆగస్టు మాసంలో కుంభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి.. ఎటువంటి అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి. వారి జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటి అలాగే వృత్తి, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యం, వివాహం, సంతన ప్రాప్తి ఇటువంటి అంశాలకు సంబంధించి ఎటువంటి గోచార ఫలితాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది. ఈ పూర్తి అంశాలను కూడా వివరంగా తెలుసుకుందాం.. రాశి ధనిష్ట నక్షత్రంలోని మూడవ నాలుగవ పాదాలు శతభిషా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడవ పాదాలు జన్మించిన వారు కుంభరాశి వారిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని అయితే ఆగస్టు మాసంలో ప్రధాన గ్రహాలైన సూర్యుడు శుక్రుడు అంగారకుడు బుధుడు తమ స్థానాలను మార్చబోతున్నారు.

కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా అనేక రకాల మార్పులు సంభవించబోతున్నాయి. అయితే ఈ కుంభరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఆగస్టు మాసంలో చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని చెప్పుకోవాలి. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ సమయంలో జాక్పాట్ కొట్టినట్లుగా ఒక మంచి అవకాశం అయితే వారి ముందుకు రాబోతుంది. అలాగే ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక అద్భుతం జరగబోతుంది అని చెప్పుకోవాలి.. ఈ విధంగా కుంభరాశి జాతకులు పోటీ పరీక్షలు రాసేవారు కావచ్చు.. విద్యార్థులకు కావచ్చు.. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలను పొందుకుంటారని చెప్పుకోవాలి. ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కుంభ రాశికి చెందినవారు ఎవరైతే వివాహం కోసం ఎన్నో రోజులుగా ప్రయత్నాలు చేస్తున్న వారు ఉన్నారో అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది.

ఎన్నో రోజుల మీ ఎదురుచూపులకి చక్కటి ఫలితం అనేది ఈ మాసంలో మీ జీవితంలో కనిపిస్తుంది. ఈ సమయంలో మీ ముందుకు ఒక మంచి సంబంధం రావడం జరుగుతుంది. ఈ విధంగా శుభ ఘడియలు రాబోతున్నాయి. అంటే మీ వివాహానికి సంబంధించి శుభ ఘడియలు అతి త్వరలోనే రాబోతున్నాయి. మీరు కొన్ని అంశాలు అంటే స్నేహితులతో కావచ్చు.. లేకపోతే ఉద్యోగస్తులతో కావచ్చు.. కొంత మట్టుకు గొడవలు జరిగే పరిస్థితులు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. వాటి వల్ల ఎటువంటి నష్టాన్ని చూడకుండానే ఆ సమస్యల నుండి బయట పడగలుగుతారు. అయితే కుంభరాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శని భగవానుని నిత్యం ఆరాధిస్తూ ఉండాలి. శని స్తోత్రం పారాయణ చేయాలి. అలాగే శనివారం రోజు ఆలయానికి వెళ్లి శని భగవానుడికి దీపారాధన చేసి ప్రతిక్షణం చేయాలి. నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలని పేదలకు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేస్తే మీరు ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకుంటారు…