ఈ టిప్స్ పాటిస్తే ఇక మీ పిల్లలు ఫస్ట్ క్లాస్ లో ఫాస్ అవుతారు.

పిల్లలు ఎగ్జామ్స్ టైం లో ఫ్రీ గా, రిలీఫ్ గా ఉండి ఎగ్జామ్స్ మంచిగా రాయాలంటే పిల్లల హిటెక్కిన మైండ్ నీ చల్ల బరచాలి.ముందుగా నిద్రను జయించాలి. నిద్రను జయించాలంటే తీసుకొనే ఆహారంలో మార్పులు చేయాలి. నిద్రను జయించాలంటే ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం మంచిది కాదు. ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం వల్ల నిద్ర వస్తుంది.రెండు పూటలు నాచురల్ ఫుడ్ ఒక పూట ఉడకబెట్టిన ఆహారం తీసుకోవడం మంచిది.

నేచురల్ ఫుడ్ లో ఒమేగా 3,ఒమేగా6, ఫ్యాటీ యాసిడ్స్ అంటే అవిసె గింజలను వాల్నట్స్ హంప్ సీడ్స్ ఇవ్వాలి. జ్ఞాపకశక్తికి జింక్ ఎక్కువ గా కావాలి. జింక్ ఎక్కువ గా ఉన్న గుమ్మడి గింజలు, బ్రెయిన్ కి శక్తి కోసం పచ్చి కొబ్బరి బాగపనిచేస్తుంది. అలాగే విటమిన్ ఈ కోసం పొద్దు తిరుగుడు గింజలు ఇవ్వాలి. ఈ గింజాలన్ని నానబెట్టి ఉదయం సాయంత్రం పూట ఇవ్వాలి. పచ్చి కొబ్బరి నాన పెట్టవద్దు. అవిసగింజలు నాన పెట్టవద్దు.పొడిచేసి కూరలలో వాడాలి.

ఇవి పెట్టడం వల్ల నీరసం రాకుండా ఉంటుంది. శక్తి బాగుంటది.నిద్ర తగ్గుతోంది. మధ్యాహ్నం ఉడికిన భోజనం చేసిన తర్వాత అరగంట పాటు పడుకోవాలి. నాచురల్ ఫుడ్ తిన్నాక చదువు కోవాలి. ఇలా చేయడం వల్ల బ్రెయిన్ చాలా ఆక్టివ్ గా ఉంటుంది. ఎగ్జాంకి వెళ్ళేటప్పుడు అహారం తినకూడదు. తేనె నీళ్ల లొ కలుపు కొని తాగితే మంచిది. బ్రెయిన్ షార్ప్ గా ఉంటుంది. ఎగ్జాం మంచిగా రాస్తారు.