గంటసేపు నీటిలో నానబెట్టి ఉదయం 2 రోజుల పాటు టిఫిన్ తినే ముందు దీనిని తీసుకుంటే కొండలాంటి పోటైనా మంచులా కరిగిపోతుంది

ఊబకాయం బారిన పడిన వారు త్వరగా గుండె జబ్బులు, పక్షవాతం వంటి వాటి బారిన పడే అవకాశం ఉంది. జీవక్రియ రుగ్మతలు, నడుము చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోవడం, శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరగడం ఇవన్నీ కూడా ఊపకాయంలో జరుగుతాయి. అందుకే బరువు పెరిగినవారు త్వరగా డయాబెటిస్ బారిన పడతారు.

శరీరంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్లను జీర్ణం చేసే విధానం మారిపోతుంది. దీని ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అప్పుడు ఆ వ్యక్తి డయాబెటిస్ బారిన పడతాడు. అధిక బరువుతో బాధపడే వారిలో ఎముకలు, కీళ్లపై అదనపు భారం పడుతుంది. దీనివల్ల ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు వస్తాయి. ఎముకలు బలహీనపడతాయి.

మోకాలు, తుంటి వంటి కీళ్ల ప్రాంతాలు అరిగిపోతాయి. అంతేకాదు బరువు అధికంగా ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అన్నవాహిక, ప్యాంక్రియాస్, పెద్దపేగు, పురీషనాళం, రొమ్ము, పిత్తాశయం , ఎండోమెట్రియన్, మూత్రపిండాల క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఎక్కువ అని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి