చనిపోయినవాళ్ళు కలలోకి వస్తే ఎంజరుగుతుంది ……

దు స్వప్నాలు, సు స్వప్నాలు అంటూ ఉంటారు కదా వాటి ప్రభావం మనుషులపై ఈ విధంగా ఉంటుంది? అటువంటి ఇ స్వప్నాలు వస్తే మనుషులు ఏం చేయాలి? అనే విషయాలపై చర్చిద్దాం!మన యొక్క ఆలోచనలను బట్టి ,తర్వాత అదే విధంగా మన యొక్క స్వభావాన్ని బట్టి, మనకు ఉన్న పరిస్థితులను బట్టి, మన యొక్క స్థితిగతులను బట్టి కూడా మనకు స్వప్నాలు కలగడం జరుగుతుంది.అయితే ఈ స్వప్నావస్థ అనేది శ్రేష్ఠమైనదిగా చెప్పబడలేదు, ఎప్పుడైనా సరే మనం నిద్ర పోవడం అనేది ఎలా ఉండాలి అంటే, కలతలు లేనటువంటి నిద్ర, అంటే కలలు రానటువంటి నిద్ర ఏదైతే ఉందో అదే ఆరోగ్యకరమైన నిద్ర గా చెప్పబడింది.అటువంటి కలతలు లేని నిద్ర కోసం మనం ప్రయత్నం చేయాలి, మనం రకరకాల ఆలోచనలు చేయడం, రకరకాల మన మానసిక భయాందోళనలో, మన యొక్క స్వభావాన్ని బట్టి కూడా ఈ స్వప్నాలు అన్ని వస్తాయి. అయితే స్వప్న లో కూడా దుస్వప్నాలు, సు స్వప్నాలు అని చెప్పి రెండు రకాలు ఉంటాయి, మంగళకరమైన టువంటి ఆ మనకు ఆనందాన్ని కలుగ చేసేటటువంటి, మరియు దైవదర్శనం అయ్యే ఎటువంటి క్షేత్ర సందర్శన చేసేటటువంటి వి అదేవిధంగా మంగళకరమైన టువంటి పసుపు కుంకుమ గాజులు పూలు ఇవన్నీ కూడా స్వప్నంలో రావడం అనేది మనం సు స్వప్నంగా మనం చెప్పుకోవచ్చు.

దుస్వప్నం అంటే, మన శత్రువులు విజృంభించడం, మన పైన దాడులు చేయడం మనం హింసించడం, మనల్ని చంపడమో తర్వాత అదేవిధంగా క్రూరమైన జంతువులు రావడం, ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటిని దుస్వప్నాలు గా మనం చెప్పుకోవచ్చు.స్వప్న ప్రకారం లో మనం చూసినట్లయితే తెల్లవారుజామున వచ్చేటటువంటి స్వప్నం ఏదైతే ఉంటుందో అది సత్యం అవుతుందని విశ్వాసం మన సంస్కృతి లో మనం చూస్తూ ఉంటాం, ఇది యధార్థం అయినటువంటి విషయం, అయితే తే.గీ కృషిలో ఉంచుకోవాలి సింది స్వప్నం వస్తే మంచిదే వస్తే కూడా తెల్లవారుజామున వస్తే జరుగుతుంది, తెల్లవారుజామున మూడు గంటల నుంచి 6 గంటల లోపు కనుక ఈ స్వప్నాన్ని కనుక మనం పొందినట్లయితే దాని యొక్క ఫలితం ప్రభావం అనేది కచ్చితంగా జరుగుతుంది. అందుచేత ఆ సమయం అనేది ఇది చాలా ప్రధానమైనది , అయితే అసలుస్వప్నాలు రాకుండా ఉండాలి అనేది ప్రధానం, స్వప్నాలు రాకుండా ఉండాలి అంటే ప్రతి నిత్యము భగవత్ ఆరాధన చేయడం ద్వారా, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ద్వారా, వేదవిధితమైన కర్మాన్ ఇష్టం కర్మానుష్టం చేయడం ద్వారా, మన లో ఉన్నటువంటి కామ, క్రోధ, లోభ మోహ వంటి వాటిని అను చుకోవడం ద్వారా మనం స్వప్నావస్థలో నుండి బయట పడడానికి అవకాశం ఉంది.

అందుచేతనే ఈ సాయం సంధ్యా సమయం అయిపోయిన తర్వాత పెద్ద వాళ్ళు ఏం చెప్తారు అంటే, పురాణ ప్రవచనం వినడం, తర్వాత అదే విధంగా ఇష్టదేవతా సందర్శనము, పూజా కార్యక్రమం వంటివి చేయమని చెబుతారు, ఈ విధంగా చేసేటటువంటి వారికి స్వప్నాలు రావు అని మన పెద్దలు చెప్తున్నారు, అయితే రాత్రి కాలాన్ని విభజన చేయడం జరిగింది, ఈ విషయం చాలా మందికి తెలియదు, సాయంత్రం 6 గంటల దగ్గరనుండి 9 గంటల వరకు ఉన్న సమయాన్ని లక్ష్మి యామము అని పిలుస్తారు. 9 గంటల దగ్గర నుండి రాత్రి 12 గంటల వరకు ఉన్న సమయాన్ని దుర్గా యామము అని పిలవడం జరుగుతుంది, 12 గంటల నుండి తెల్లవారుజామున మూడు గంటల వరకు ఉన్న సమయాన్ని కాళీ యామము అని పిలుస్తారు,తెల్లవారుజామున మూడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు ఉన్న ఆ సమయాన్ని సరస్వతి అని పిలుస్తారు. లక్ష్మీ ఉపాసన అనే అటువంటిది లక్ష్మీ యామం లోనూ, దుర్గ ఉపాసన అనేది దుర్గా యామం లోనూ, కాళీ ఉపాసన అనేది కాళీ యామం లోనూ, తర్వాతిది సరస్వతి ఉపాసన అనేది సరస్వతి యామం లోనూ చేసినట్లయితే సిద్దించడం అనేది జరుగుతుంది, అయితే తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, ఆ సమయంలో నిద్రలేచి చక్కగా శిరస్నానం చేసి భగవత్ ఆరాధన అనేది మనం ఎప్పుడైతే చేస్తాము అప్పుడు చక్కటి ఫలితాన్ని ,అభివృద్ధిని పొందుతాము.