సింగర్ సునీత మాట్లాడిన ఈ మాటలు వింటే మీ రక్తం మరిగిపోతాది..అసలు ఏమి జరిగింది?

సోషల్ మీడియా వల్ల జనాలకి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అన్నే నష్టాలు కూడా ఉన్నాయి, సోషల్ మీడియా ని మంచిగా వినియోగిస్తే దానికి మించిన శక్తివంతమైన మీడియా ప్రపంచం లో ఎక్కడ లేదు, కానీ అదే సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చెడుకు వినియోగిస్తే ఎంతో మంది జీవితాలే నాశనం అయిపోతాయి,కొన్ని కోట్లమంది జనాలకు అనుసంధానం చేసే సోషల్ మీడియా వంటి పవర్ ఫుల్ మీడియం ని ఉపయోగించుకొని కొంతమంది చేస్తున్న ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది , ముఖ్యంగా ప్రేమ పేరు తో మోసం చేసి అమ్మాయిలపై ఆగడాలు చేసే మనుషుల దగ్గర నుండి, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాం అంటూ కొన్ని లక్షలు, వేల రూపాయిలు దోపిడీ చేసే దుండగుల సంఖ్య ఇటీవల కాలం లో ఒక్క రేంజ్ లో పెరిగిపోయింది, సరిగ్గా ఇలాంటి సంఘటన సింగర్ సునీత విషయం లో కూడా జరిగింది అంట, ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతు మాట్లాడే సునీత మొట్ట మొదటిసారి ఉగ్రరూపం దాల్చి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం వైరల్ గా మారింది, అసలు ఏమి జరిగింది, ఎందుకు ఆమె అంతలా రియాక్ట్ అయ్యింది అనే దానిపై ఇప్పుడు మనం ఈ ఆర్టికల్ లో చూడబోతున్నాము.తన పేరు వాడుకొని సోషల్ మీడియా లో ఆగడాలు మరియు మోసాలు చేసే వారిపై సునీత మాట్లాడుతూ ‘ఇటీవలే నేను డైలీ న్యూస్ పేపర్ లో ఒక్క ఆర్టికల్ చదవడం జరిగింది .

https://youtu.be/0oGbROOFXO4

ఎవరో చైతన్య అనే అబ్బాయి అనంతపురం లో ఎంతోమందికి నా పేరు చెప్పి మరియు నా ఫామిలీ పేరు చెప్పి సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాము అని భ్రమింపచేసి ఎంతో డబ్బులు దండుకుంటున్నారు అనే విషయం నాకు తెలిసింది,నా కూతురు మరియు కొడుకు పేర్లని వాడుకొని, నాకే తెలియని నా మేనకోడలు పేరు కూడా వాడుకొని సినిమాల మీద మక్కువ ఉండే ఎంతో మంది అమాయకుల దగ్గర సినిమా అవకాశాలు ఇప్పిస్తాము అని చెప్పి మోసం చేసి లక్షల తుపానులు దండుకున్నారు అట,వాడెవడో నాకు కనిపిస్తే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను, దయచేసి ఇలాంటి నీచుల్ని నమ్మి మోసపోకండి, మిడిమిడి జ్ఞానంతో ఉన్న వారు మోసపోతున్నారు అంటే అయ్యో పాపం అనుకోవచ్చు, కానీ ఇంత చదువులు చదివిన మీరు కూడా అలంటి మాయాగాల్లో వలలో పడితే ఎలా?,దయచేసి గమనించండి, నేను ఈ విషయం ని అంత తేలికగా వదలను, పోలీసులకు కంప్లైంట్ చేసి వాడి అంతు తెలుస్తాను, దయచేసి నా పేరు వాడుకొని చైతన్య పేరు తో ఎవ్వరు వచ్చిన నమ్మి మోసపోకండి, కనీసం ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టిన తిరస్కరించండి, ఇది మీ అందరికి చెప్పడం నా బాధ్యత, వాడు కనిపిస్తే మాత్రం నా చేతిలో మాములు గా ఉండదు’ అంటూ సునీత చెప్పుకొచ్చింది.

ఇక సింగర్ సునీతా గారి విషయానికి వస్తే గత ఏడాది ఈమె రామ్ అనే అతఁ౫హానిని రెడ వివాహం చేసుకున్న సంగతి మన అందరికి తెలిసిందే, పెళ్లి తర్వాత ఎంతో సుఖమైనా జీవితం ని గడుపుతూ మరో పక్క సినిమాల్లో కూడా మంచి డిమాండ్ ఉన్న సింగర్ గా దూసుకుపోతుంది,అయితే ఎప్పుడు ఎంతో సౌమ్యంగా ఉండే సునీత గారి ఇటీవల సోషల్ మీడియా లో కొంతమంది చేసే ఆకతాయిల కామెంట్స్ వల్ల తనకి ఉన్న టెంపర్ ని కోల్పోతున్నారు,ఇటీవల ఒక్క ఫేస్ బుక్ లైవ్ చాట్ లో కూడా సునీత గారు ఒక్కడు చేసిన పిచ్చి కామెంట్ కి తనలోని ఆవేశం ని బాటకి తీశారు, ఒక్క సునీత గారు మాత్రమే కాదు, సెలెబ్రిటీలు అయినా పాపానికి సోషల్ మీడియా లో ఎంతో మంది ఇలాంటివి రోజు ఎదురుకొంటూనే ఉన్నారు, ఇలా పిచ్చి కామెంట్స్ చేసి అవతల మనుషులను బాధ పెట్టె సంస్కృతి సోషల్ మీడియా లో ఎప్పుడు తగ్గుతుందో ఎవ్వరు చెప్పలేకపోతున్నారు, సోషల్ మీడియా ప్రతినిధులు వీటిని అదుపులోకి తీసుకొని రావడానికి ఎన్ని ప్రయత్నాలు చేసిన విఫలం అవుతూనే ఉన్నారు, రాబొయ్యే రోజుల్లో అయినా ఈ నీచమైన సంస్కృతి కొనసాగడం ఆగుతుందో లేదో చూడాలి.