Diabetes : ఈ జ్యూస్ లు తాగితే షుగర్ సమస్య వారం రోజులలో మటుమాయం…

Diabetes : ప్రపంచం మొత్తాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. మారిన ఆహారపు అలవాట్లతో అభివృద్ధి చెందిన దేశాల నుంచి సాధన గ్రామస్థాయి కూడా ఈ ఆరోగ్య సమస్య వేధిస్తోంది. అయితే ఆహారపు అలవాటులో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎంత ప్రమాదకర వ్యాధులు అయిన అప్రమత్తంగా ఉంటే అంతగా నియంత్రించవచ్చు. బ్లడ్ షుగర్ ను ఎప్పుడూ అదుపులో ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే డయాబెటిస్ ఉన్నవాళ్ళకు గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువే. అంతే కాదు..

మధుమేహం కారణంగా మూత్రపిండాల సమస్య ఎదురవుతుంది. అందుకే ఆహారపు అలవాటులో మార్పులు చేసుకోవడం వల్ల కొన్ని రకాల పదార్థాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. ముఖ్యంగా ఐదు రకాల ద్రౌవ పదార్థాలతో సాధ్యమే అంటున్నారు. అవేంటో చూద్దాం.

గ్రీన్ టీ : డయాబెటిక్ రోగులకి గ్రీన్ టీ ఓ దివ్య ఔషధం. ఇందులో కార్బోహైడ్రేట్లు కేలరీలు తక్కువగా ఉండడంతో శరీరానికి మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడంతో ఇన్ఫెక్షన్ నుంచి కాపడతాయి. గుండె సమస్యలు టైప్ టు డయాబెటిస్ వారికి చాలా మంచిది. శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది.

కాకరకాయ జ్యూస్ ; ఈ కాకరకాయ జ్యూస్ రోజు తప్పకుండా తీసుకుంటే మధుమేహం వ్యాధిగ్రస్తులు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసుకోవచ్చు.. కడుపుకు సంబంధించిన వ్యాధులు కూడా దూరమవుతాయి.

బీట్రూట్ జ్యూస్ : ఇక మూడవది బ్లడ్ షుగర్ నియంత్రించే బీట్రూట్ జ్యూస్ శరీరంలో రక్తహీనతను కూడా దూరం చేస్తుంది. చలికాలంలో తీసుకోవడం వల్ల వెచ్చగా ఉంటుంది

కొబ్బరి నీళ్లు : కొబ్బరినీళ్లు ఇందులో ఉండే విటమిన్లు మినరల్స్ కారణంగా అలసట ఉండదు. కొబ్బరినీరు శరీరంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. ఇందులో పుష్కలంగా ఉండే క్యాల్షియం, ఫాస్ఫరస్, విటమిన్ ఏ, బి వన్ గా శరీరంలో హార్మోన్స్ విడుదల బ్యాలెన్స్గా ఉంటుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి…