అనారోగ్యంతో బాధపడుతున్న…రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్…

ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో చాలా మంది నటీమణులు అరుదైన వ్యాధులతో బాధపడుతూ పోస్టులు పెట్టి అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. గత సంవత్సరం సమంత, ఇటీవల కల్పిక గణేష్ మరియు మమతా మోహన్‌దాస్ తమ ఆరోగ్య సమస్యలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.

తాజాగా మరో నటి తన అనారోగ్యాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ నటి మరెవరో కాదు రేణు దేశాయ్. ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రేణు దేశాయ్.. పవన్‌తో పెళ్లి తర్వాత తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. అయితే పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత పరస్పర అంగీకారంతో విడిపోయారు.

కాగా, గత కొన్ని రోజులుగా తాను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రేణు దేశాయ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. నా అనుచరులందరికీ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏళ్ల తరబడి రకరకాల పరిస్థితులను ఎదుర్కొంటున్నాను. నేను ఎలాంటి ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్నానో చెప్పాలనుకుంటున్నాను.

నన్ను దగ్గర్నుంచి చూస్తున్న వాళ్ళకి తెలుసు, గత కొన్నాల్లుగా నేను గుండె మరియు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాను, వాటిని ఎదుర్కొనేందుకు శక్తిని కూడగట్టుకుంటున్నాను, నాలాగే ఎవరైనా బాధపడతు ఉంటే వారిలో ధైర్యాన్ని పాజిటివ్ ఎనర్జీని నింపేందుకు ఈ పోస్ట్ చేస్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దు, బలంగా నిలబడాలి, ఏదో ఒక రోజు మన కృషికి తగ్గ ఫలితం లభిస్తుంది.

మన జీవితం మీద మనకు నమ్మకం ఉండాలి, ప్రస్తుతం నాకు చికిత్స జరుగుతుంది. మందులు వాడుతున్నాను, యోగా చేస్తున్నాను, మంచి పోషక ఆహారాన్ని తీసుకుంటున్నాను, త్వరలోనే దీని నుండి కోలుకొని షూటింగ్లో పాల్గొంటాను, అంటూ రేణు దేశాయ్ తన ఇంస్టాగ్రామ్ లో రాసుకువచ్చింది. కానీ తనకున్న అనారోగ్యం ఏంటి అన్నది ఆమె పూర్తిగా రివిల్ చేయలేదు.