అవయవాలను శుద్ధి చేసే పండు…

అవయవాలను శుద్ధిచేసే పండు, పోషకాలు మెండు, ప్రకృతిపరంగా లభించే పండ్లు కాయలు తినడం ద్వారా మరింత ఆరోగ్యంగా ఉండవచ్చు, కొన్ని రకాల పండ్లు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అందడమే కాకుండా, శరీరంలోని అవయవాలను సైతం క్లీన్ చేస్తాయి. ఆ విషయంలో నేరేడు పండు ఎంతో బాగా పనిచేస్తుంది. అంతేకాదు కొన్ని పండ్లలో రోగాలను తగ్గించే గుణాలు కూడా ఉన్నాయి, అలాంటి పండ్లలో నేరేడు పండు ముందు వరుసలో ఉంటుంది. నేరేడు పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నేరేడు పండు పోషకాల గని అనారోగ్యాలు అడ్డుకట్టవేసి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం, ఒక్క పండే కాదు ఆకులు బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. చాలా కాలంగా కడుపులో పేరుకుపోయిన మలినాలను బయటకు పోవడానికి నేరేడు పండ్లను తినడం మంచిది.

పేగులలో చుట్టుకుపోయిన వెంట్రుకలను కూడా కోసేసి బయటికి పంపే శక్తి నేరేడు పళ్ళకు ఉంది, నేరేడు పండు శరీరానికి చలువ చేస్తాయి. నేరేడు పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మూత్ర సంబంధిత సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. నీరసం నిస్సత్తువ ఉన్న వారు నేరేడు పండును తింటే తక్షణ శక్తి వస్తుంది. అంతే కాదు వెన్ను నొప్పి నడుము నొప్పి, మోకాళ్ళ నొప్పి నయం అవుతాయి. జిగట విరోచనాలు లతో బాధపడే వారికి నేరేడు పండ్ల రసాన్ని రెండు నుంచి మూడు చెంచాల చొప్పున ఇవ్వాలి. రోగికి శక్తితో పాటు పేగుల కదలికలను నియంత్రణలో ఉంటాయి, ఎంతో ఉపయోగకరమైన నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు అని డాక్టర్లు చెబుతున్నారు.నేరేడు అరగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలని వైద్యనిపుణులు చెబుతున్నారు.

భోజనం చేసిన గంట తర్వాత ఈ పండ్లు తీసుకుంటే ఆహారం తొందరగా జీర్ణం అవుతుంది. నేరేడు పండ్లను అధికంగా తీసుకుంటే జీర్ణసంబంధిత సమస్యల తో పాటు పలు చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. కాలేయం పనితీరు క్రమబద్ధీకరించడానికి లేదా శుభ్రపరచడానికి నేరేడు దివ్యౌషధంలా పనిచేస్తుందని పలు అధ్యయనాలలో వెల్లడైంది. ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు గుండె కు ఔషధంగా పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నప్పుడు ధనియాల రసంలో నేరేడు పండు రసం కలిపి తీసుకుంటే శరీర తాపం తగ్గుతుంది, మూత్రం మంట తగ్గడానికి నిమ్మరసం నేరేడు రసం రెండు చెంచాల చొప్పున నీళ్లలో కలిపి తీసుకోవాలి. పిండి పదార్థాలు కొవ్వు భయం ఉండదు కనుక నేరేడు పండ్లను అధిక బరువు ఉన్నవారు, మధుమేహ రోగులు సైతం వీటిని తినవచ్చు. రోజుకి ఆరు నుండి ఎనిమిది వరకూ తినవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.