ఆకు కూరలతో కోట్ల సంపాదిస్తున్నారు.. ఊరు మొత్తానికి ఇదే..!

Earns Crores Leafy Vegetables : కేవలం ఆకుకూరతోనే మూడు కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు.. రేకులు కుంట అనే గ్రామంలో ఓ పెద్దాయన 51రాల పొలాల్లో పాలకూర, గోంగూర, మెంతికూర, బచ్చల కూర అన్ని ఆకుకూరలు వేసి దానిని పండిస్తూ మూడు కోట్ల రూపాయలను సంపాదిస్తున్నాడట.. 50 ఎకరాల్లో ఈ ఆకుకూరలు పండిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారు. ఆకుకూరలు తక్కువగా ఉన్నప్పుడు వారి కుటుంబం మొత్తం కూలీలుగా మారి దాని కట్టలుగా చేసి తారట..

ఆకుకూరలు పెద్దగా అయిన తర్వాత ఎక్కువగా ఉన్న టైంలో ఊర్లో వాళ్ళని కూలిగా పెట్టుకొని 300 రూపాయలుగా కూలీ చెల్లిస్తూ రోజుకి కొన్ని లక్షల కట్టలను సేల్ చేస్తారట. కట్ట రూపాయి చొప్పున అమ్ముతారట. ఈ విధంగా ఓ పెద్దాయన రేకులకుంట్ల ఇలా సాగు చేస్తూ ఊరంతా కూడా జీవన ఉపాధి కల్పిస్తూ మూడు కోట్ల రూపాయల్ని సంపాదిస్తున్నాడు.. ఒక్కొక్కసారి టౌన్ కి పంపిస్తారట. ఇతర టౌన్ వాళ్లు కూడా వచ్చి వారి దగ్గర కొనుగోలు చేస్తారట.

ఒక్కొక్కసారి 50 పైసలకి కట్టను ఇస్తారట.. ఒక్కొక్కసారి కట్టకు రూపాయి చొప్పున చెల్లిస్తారట. ఈ విధంగా లక్ష కట్టల పైన అమ్ముతామని రేకులు కుంట వెంకన్న గారు తెలియజేశారు.. మా ఊరు మొత్తం కూడా మా ఆకుకూర తోటలోని పని చేస్తూ ఇక్కడ కట్టలను తీసుకెళ్లి వారు పట్టణంలో అమ్ముకుంటారు. అని ఆ పెద్దాయన చెప్పారు. ప్రతి ఏటా 50 ఎకరాలలో ఆకుకూరలు వేసి ఇలా నేను మూడు కోట్లు సంపాదిస్తున్నాను అని ఆయన తెలిపారు.