ఆపిల్ పండు విత్తనాలు తింటే ప్రాణాలు పోవటం కాయం అసలు నిజం ఇదే

Apple: సాధార‌ణంగా ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ తీసుకునే వారెవ‌రైన ఆపిల్ త‌ప్పక తీసుకుంటారు. ఆపిల్ మ‌న‌కు ఎంత మేలు చేకూరుస్తుంతో దాని విత్త‌నాలు మ‌న‌కు తెలియ‌కుండానే అనారోగ్యం చేకూరుస్తాయి. ఆరోగ్యాన్నివిష‌పూరితం చేస్తాయి. పోషకాలతో సమృద్ధమైన ఈ ఆపిల్స్ యాంటీఆక్సిడెంట్స్ కలిగి ఉండటం వల్ల, మన శరీరాన్ని ప్రాణాంతక వైరస్ ల‌ నుంచి, అంటే క్యాన్సర్‌ని ప్రేరేపించే ఆక్సిడైజేషన్లతో సహా, వివిధ ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే వాటినుంచి మిమ్మల్ని కాపాడుతుంది.ఆపిల్ మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చినా కూడా దాని కేంద్రభాగంలో ఉండే నల్లని గింజ‌లు చాలా న‌ష్టాన్ని చేకూరుస్తాయి. మనలో చాలామంది అనుకోకుండా 1-2 గింజలను నమిలేస్తూ ఉంటారు. ఈ ఆపిల్ గింజలలో అమిగ్డాలిన్ అని పిలువబడే ఒక పదార్థాన్ని కలిగి ఉంటాయి, ఇది మానవ జీర్ణ ఎంజైమ్లతో ప్రతిచర్య చెందిన వెంటనే సైనైడ్ను విడుదల చేస్తుంది.ఆపిల్ విత్త‌నాల‌ను తిన్న త‌ర్వాత సైనైడ్ మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ‌పై అనేక ప్ర‌తి కూల ప్ర‌భావాల‌ను చూపిస్తుంది.

https://youtu.be/d9MmIaiWsUU

ఆపిల్ గింజలను తినడం వల్ల చేదు రుచిని తప్ప మీ శరీరం ఎటువంటి హానిని ఎదుర్కొనవలసిన పరిస్థితి ఏమీ లేదు, కానీ ఈ ఆపిల్ గింజలను మీరు ఎక్కువ మోతాదులో తీసుకున్నట్లయితే, మీ శరీరానికి జరిగే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది.చ‌రిత్ర ఒక‌సారి ప‌రిశీలిస్తే సైనైడ్ అనేక మంది మ‌రణాల‌కు కార‌ణ‌మైన విష‌యం తెలిసిందే. సైనోగ్లైకోసైడ్లు అని పిలిచే ఒక సమ్మేళనము ఆపిల్‌ పండు గింజలలో కనబడుతుంది. చరిత్రలో జరిగిన మానవ యుద్ధాల ద్వారా సైనేడ్ అనే పేరు చరిత్ర పుటలలోకి వచ్చింది. ఈ సైనేడ్ ఆక్సిజన్-సరఫరా చేసే కణాలతో జోక్యం చేసుకుని రసాయనిక చర్యకు లోనగుట వల్ల, వీటిని అధిక మొత్తంలో వినియోగిస్తే మరణానికి దారి తీస్తుంది.చిన్న ఆపిల్స్ కలిగి ఉండే గింజలలో కనిపించే అమిగ్దాలిన్ అనేవి కూడా ఒక రకమైన సైనైడ్స్. ఈ గింజలు ఎక్కువగా రోజ్ కుటుంబానికి చెందిన పండ్లలో అంటే నేరేడు, బాదం, ఆపిల్, పీచ్ & చెర్రీస్లలో కలిగి ఉంటుంది. ఈ అమిగ్దాలిన్ సమ్మేళనం అనేది చిన్న గింజల లోపల, దాని రసాయన రక్షణ నిలయంలో భాగంగా ఉంటుంది.

కాబ‌ట్టి సైనైడ్ ఉన్న పండుని తింటే మీ ఆరోగ్యం డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే అనే విష‌యం గుర్తుంచుకోండి.మీరు యాపిల్‌ గింజలను అనుకోకుండా నమలడం, తినడం (లేదా) జీర్ణమైన తర్వాత, అందులో ఉన్న అమిగ్దాలిన్ హైడ్రోజెన్ సైనైడ్గా రూపాంతరం చెందుతుంది. కాబట్టి, అలా ఈ చిన్న గింజలు మరింత విషపూరితంగా మారి మీ ప్రాణాలకే ప్రాణాంతకం అవుతుంది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెంట్ తెలిపిన దాని ప్రకారం, 1-2 mg/kg గా ఉన్న సైనైడ్, 154 పౌండ్లు అనగా 70 కిలోల బరువు కలిగిన వ్యక్తికి ప్రాణాంతక మోతాదుగా ఉంటుంది. దీని అర్థం, ఒక వ్యక్తి ఈ మోతాదును పొందేందుకు 20 ఆపిల్స్ నుండి 200 ఆపిల్ విత్తనాలను తీసుకోవాలి.శరీరం సైనైడ్కు గురైనప్పుడు, అది మెదడును & హృదయాన్ని దెబ్బతీస్తుంది, అలాగే శరీరాన్ని కోమాలోకి తీసుకువెళ్ళి, ఆ తరువాత మరణానికి దారి తీయగలదు. ఆపిల్ పండులో ఉండే విత్తనాలు (లేదా) ఆప్రికాట్లలో, పీచెస్ & చెర్రీస్ వంటి వాటిలో గల పిట్స్ను ప్రమాదవశాత్తు నమలడం నివారించాలని ఏజెన్సీ సూచించింది.