డయాబెటిస్ అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కనిపిస్తూనే ఉంది .చాలా మంది దీని వల్ల వచ్చే వ్యాధులతో బాధపడుతున్నారు .షుగర్ భోజనానికి ముందు 80mg/dl -120mg /dl భోజనం తర్వాత 180mg /dl ఉండాలి కానీ కొంత మందిలో 200,300,400 వరకు ఉంటుంది ప్రతి 7సెకoడ్లకు ప్రపంచ వ్యాప్తంగా షుగర్ వలన ఒకరు చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళు చెబుతున్నారు . డాక్టర్లు ఇచ్చే మందులు షుగర్ని నియంత్రణలో ఉంచుతాయి కానీ శాశ్వతంగా తగ్గించలేవు .షుగర్ నియంత్రణలో ఉపయోగపడే కొన్ని ఔషధ మొక్కలు ఉన్నాయి .వీటిని ఉపయోగించడం వలన సహజంగా షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంటాయి .ఈ మొక్కలు మన ఇంటిదగ్గర అందుబాటులో ఉండేవి.
అందులో మొదటి మొక్క తిప్ప తీగ :ఈ చెట్టుకి ఎర్రటి కాయలు గుత్తులుగుతులుగా ఉంటాయి వీటి ఆకులు మందంగా మెరుస్తూ హృదయాకారంలో ఉంటాయి . ఇవి రోడ్డుకిరువైపులా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి . మీకు ఈ మొక్కలు గుర్తించడం కష్టం అయినప్పుడు .పెద్దవారి సహాయసంతో గుర్తించండి . నాలుగు ఆకులు తీసుకొని ఒక గ్లాస్ నీటిలో మరిగించి ఆ నీటిని 21రోజులు పరిగడుపున తాగడం వలన షుగర్ వ్యాధిని తగ్గించే గుణం ఉంటుంది .
రెండవమొక్క జామ :ఈ ఆకులలో షుగర్ ను తగ్గించే గుణం ఉంటుంది . నాలుగు లేదా ఐదు ఆకులు నీటిలో మరిగించి ఆ నీటిని ప్రతి రోజు తాగడం వలన షుగర్ నియంత్రణలో ఉండటం గమనించవచ్చు .
మూడవ మొక్క కరివేపాకు :ప్రతి రోజు ఉదయం 4కరివేపాకు ఆకులను నమలడం వల్ల షుగర్ లెవల్స్ నార్మల్కి వస్తాయి .
నాలుగవ మొక్క కలబంద :కలబందలో ఔషధ గుణాల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు .దీనిని అనేక చర్మ ,జుట్టు సంరక్షణలో భాగంగా ఉపయోగిస్తూవుంటాo .అలాగే ఆరోగ్య రక్షణకు చాలా బాగా ఉపయోగపడుతుంది . కలబంద చిన్న ముక్కలోని గుజ్జును ఒకగ్లాస్ నీటిలో కలిపి పరిగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి శాశ్వతంగా తగ్గిపోతుంది .
ఇక ఐదవ మొక్క తులసి :తులసి ఆకులు వాసన పీల్చడం వలన ,ఇంటి ముందు ఉండటం వలన ఎన్నో వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చని మనందరికీ తెలుసు . పది ఆకులు తీసుకుని ఒక గ్లాస్ నీటిలో పది నిముషాలు మరిగించి ఉదయాన్నే పరిగడుపున తాగడం వలన షుగర్ వ్యాధి శాశ్వతంగా పోతుంది .
ఇక ఆరవది మామిడి లేదా నేరేడు :ఈ రెండు ఆకులను కలిపి నీటిలో మరిగించి పరిగడుపున 21రోజులు తాగడం వలన శాశ్వతంగా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది .ఈ ఆకులు అనేక ఆయుర్వేద గుణాలను కలిగి ఉంటాయి ఇది సహజంగా షుగర్ ను కంట్రోల్లోకి తీసుకు రాగలవు .
ఏడవ మొక్క బిల్వ పత్రాలు :శివునికి ఎంతో ఇష్టమైన మారేడు ఆకులను బిల్వపత్రాలు అనికూడా అంటారు ఈ మొక్క ప్రతి ఊరిలోను శివాలయాలలో అందుబాటులో ఉంటుంది . ఆయుర్వేదం ప్రకారం బిల్వపత్రాలలో అనేక ఆయుర్వేద గుణాలు ఉంటాయి .ఈ మొక్క ఆకులను మరిగించి ఆ కషాయాన్ని రోజు తీసుకోవడం వలన షుగర్ నియంత్రణలో ఉంచుకోవచ్చు .