నవదీప్ ఫోన్ ను సీజ్ చేసి షాకిచ్చిన నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. ఆ విషయాలు వెలుగులోకి వస్తాయా? 

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి సెలబ్రిటీల మెడకు మాదాపూర్ డ్రగ్స్ విషయం ఒక ఉచ్చు లాగా బిగుసుకుంది.మాదాపూర్ డ్రగ్స్ కేసులో భాగంగా A29 గా ఉన్నటువంటి నటుడు నవదీప్ ను నేడు నార్కోటిక్ పోలీసులు విచారించారు ఈయనని విచారించడానికి గాను కోర్టు నుంచి అనుమతి తీసుకున్నటువంటి నార్కోటిక్ పోలీసులు దాదాపు 8 గంటల పాటు నవదీప్ ను విచారించారు.ఈ 8 గంటల సమయం పాటు ఆయనకు మూడుసార్లు బ్రేక్ ఇచ్చి విచారణ చేపట్టారని విచారణ అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి నవదీప్ వెల్లడించారు.

నార్కోటిక్ అధికారులు తనని చాలా లోతుగా మూలాల నుంచి కూడా విచారణ చేశారని ఈయన వెల్లడించారు.దాదాపు 8 సంవత్సరాల క్రితం నాటి ఫోన్ కాల్స్ ఆధారంగా తనని విచారణ చేశారని అధికారులు మాత్రం చాలా బ్యూటిఫుల్ గా విచారణ చేస్తున్నారు అంటూ ఈ సందర్భంగా నవదీప్ వెల్లడించారు.అయితే తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుంది ఏంటి అనే విషయాలను తనకు తెలియజేయలేదని ఈయన పేర్కొన్నారు.ఇక మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో కీలకంగా ఉన్నటువంటి రామ్ చందర్ అనే వ్యక్తిపై కూడా ఈ సందర్భంగా నవదీప్ స్పందించారు.నాకు ఈ హైదరాబాదులో సుమారు పదివేల మంది వరకు తెలుసు ఆ పదివేల మందిలో ఈ రామ్ చందర్ అనే వ్యక్తి కూడా ఒకరు అంటూ ఈయన సమాధానం చెప్పారు.

తదుపరి విచారణ ఎప్పుడున్నా కానీ తాను మాత్రం పోలీసులకు అందుబాటులోనే ఉంటానని ఈ సందర్భంగా నవదీప్ మీడియా సమావేశంలో మాట్లాడారు.అయితే తాజా సమాచారం ప్రకారం నార్కోటిక్ అధికారులు ఈయన ఫోన్ సీజ్ చేశారని తెలుస్తోంది.గతంలో ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టినటువంటి అధికారులు ఈసారి చాటింగ్ డేటా, మెసేజింగ్ డేటా గురించి పూర్తి విచారణ జరుపబోతున్నారని అందుకే ఈయన ఫోన్ కూడా సీజ్ చేసి ఆయనకు షాక్ ఇచ్చారని తెలుస్తోంది.అయితే ఈ డేటా మొత్తం సేకరించిన తర్వాత మరోసారి నవదీప్ ను నార్కోటిక్ అధికారులు విచారణకు పిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తెలుస్తుంది.