పురుగులు పట్టిన బియ్యం తినొచ్చా ?? తింటె ఏమౌతుంది ??

సాధారణంగా బియ్యం నిల్వ ఉండే కొద్దీ ఆరోగ్యానికి మంచిదంటారు. అయితే ఎక్కువ కాలం బియ్యం నిల్వపెట్టినప్పుడు వాటికి పురుగులు పడుతూ ఉంటాయి. నగరాల్లో నివసించేవారైతే 25, 30 కేజీల రైస్ బ్యాగులు తెచ్చుకుంటారు. ఇవి చిన్న ఫ్యామిలీలకు రెండు, మూడు నెలలు వస్తాయి. పెద్దగా పురుగులు పట్టే అవకాశం ఉండదు. పల్లెటూర్లలో అయితే ఏడాదికి సరిపడా ధాన్యం ఒక్కసారే మిల్లులో ఆడించి.. బియ్యాన్ని నిల్వ చేసుకుంటారు. దీంతో బియ్యానికి పురుగులు పట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

అలాంటప్పుడు.. ఆ బియ్యాన్ని చెరిగి.. పురుగులను వేరు చేసి.. రైస్ వండుకుని తింటుంటారు. ఇలా చెయ్యడం మంచిదేనా.. నిపుణులేమంటున్నారు? తెలుసుకుందాం! నిపుణులు చెబుతున్న వివరాల ప్రకరాం.. నిల్వ ఉంచిన బియ్యానికి ముక్కు పురుగులు, నుసి పురుగులు, లద్ది పురుగులు వంటివి ఎక్కువగా పడుతూ ఉంటాయి. అయితే పురుగులను చెరిగి.. ఆ బియ్యంతో అన్నం వండి తింటే పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదంటున్నారు నిపుణులు.

Add Comment