బాలకృష్ణ వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన అక్కినేని హీరోలు. ట్వీట్ వైరల్!

ఇటీవల వీరసింహారెడ్డి మూవీ సక్సెస్ మీట్ లో నందమూరి బాలకృష్ణ.. లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గురించి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో భారీ చర్చలకు దారితీశాయి. బాలకృష్ణ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. వీళ్లతో నాకు మంచి టైమ్ పాస్ అయ్యింది. వీళ్లతో కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం’’ అంటూ బాలకృష్ణ వ్యాఖ్యానించారు.

ప్రస్తుతం బాలయ్య చేసిన వ్యాఖ్యలే వివాదాస్పదంగా మారాయి. ఓవైపు బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్‌ మండిపడుతుండగా.. అక్కినేని హీరోలు ఎప్పుడెప్పుడు రియాక్ట్ అవుతారా అని వెయిట్ చేస్తున్నారు.ఇప్పటికే అక్కినేని ఫ్యాన్స్ అంతా పలురకాలుగా బాలయ్య కామెంట్స్ పై సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు.

‘ తెలుగు చిత్రసీమలో మహనీయుడు ఎన్టీఆర్ తో సహా నటుడిగా అక్కినేని నాగేశ్వరరావు ప్రస్థానం కూడా అంతే గొప్పగా సాగింది. వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేది. ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇలా వ్యాఖ్యానించడం కరెక్ట్‌ కాదంటూ అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. తాజాగా బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని హీరోలు ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు. అక్కినేని హీరోలు రియాక్ట్ అవుతూ..

“నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు తెలుగు కళామతల్లి ముద్దు బిడ్డలు. వారిని అగౌరవపర్చడం.. మనల్ని మనం కించపరుచుకోవడమే” అంటూ ట్వీట్స్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కినేని హీరోల రియాక్షన్ నెట్టింట వైరల్ గా మారింది. మరి బాలయ్య – అక్కినేని హీరోల వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.