బ్రిటన్ నుంచి వచ్చిన హైద్రాబాద్ కు వచ్చిన ఓ మహిళకు కరోనా.. ఒమిక్రాన్‌‌గా తేలితే మరిన్ని ఆంక్షలు

బ్రిటన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది.కరోనా విజృంభిస్తున్న వేళ ఆమెకు పాజిటివ్ నిర్ధారణ కావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. బాధితురాలిని టిమ్స్‌లో అడ్మిట్ చేసి.. జినోమ్‌ సీక్వెన్స్‌ కోసం నమూనాలు ల్యాబ్‌కు పంపారు. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఒకవేళ ఆమెకు ఒమిక్రాన్‌ అని తేలితే హైదరాబాద్‌లో కొన్ని ఆంక్షలు విధించాలని ప్రభుత్వం భావిస్తోంది. వారం క్రితం వరకు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కజ్‌గిరి జిల్లాల్లో రోజుకు 50 లోపే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఒమిక్రాన్ బయటపడిన తర్వాత.. రెండు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరిగి వందకు చేరింది. ఈ నేపథ్యంలో నగరంలో కరోనావైరస్ మళ్లీ ప్రభావం చూపిస్తోందా? అని అధికారులు అనుమానిస్తున్నారు.

https://youtu.be/7O_6OR_CHVk

అందుకే హైదరాబాద్‌లో ఫేస్ మాస్క్‌ను తప్పనిసరి చేశారు. లేదంటే రూ.1000 జరిమానా విధిస్తున్నారు. స్కూళ్లలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పటాన్‌చెరులోని ఓ స్కూల్‌లో 25 మంది విద్యార్థులు కరోనాన బారిన పడ్డారు. ప్రస్తుతం పాఠశాలల్లో విద్యార్థులను గుంపులు గుంపులుగా కూర్చోబెడుతున్నారు. మాస్కులు కూడా ధరించడం లేదు. అందుకే కేసులు పెరుగుతున్నాయి. నగరంలోకి ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రవేశిస్తే పరిమిత ఆంక్షలు విధించే అవకాశముంది. కేసుల సంఖ్య పెరిగితే స్కూళ్లను మూసివేసి… మళ్లీ ఆన్‌లైన్‌ క్లాసులకే మొగ్గు చూపనున్నట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. మరో వారం రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని తెలిపారు. ఒమిక్రాన్ నేపథ్యంలో ఆస్పత్రుల్లో ఏర్పాట్లపైనా అధికారులు దృష్టిసారించారు. గాంధీలో ప్రస్తుతం 1800 పడలకలు ఉండగా.. అందులో 120 మాత్రమే కరోనా రోగులకు కేటాయించారు. ఒకవేళ ఒమిక్రాన్ కేసులు పెరిగితే.. వాటికి అనుగుణంగా పడకల సంఖ్యను పెంచుతామని వైద్యాధికారులు చెబుతున్నారు.