Free Electric : ఇక నుండి వీరికి ఉచిత విద్యుత్ రాదు.. పూర్తి కరెంట్ బిల్లు కట్టక తప్పదు..!

Free Electric  : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి. గృహజ్యోతి స్కీమ్.. రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్.. ఈ స్కీం అమల్లో కొచ్చి రెండు నెలలు దాటింది.. అయితే ఈ స్కీమ్లో ఇప్పుడు కొన్ని మార్పులు చేయడానికి ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది.. రాష్ట్రంలో ఎండలు పెరిగిపోయాయి. ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక అందరు ఇబ్బంది పడుతున్నారు.. ఈ నేపథ్యంలో ఇంట్లో ఏసీ ,ఫ్యాన్, కూలర్, తదితరలా వినియోగం అధికంగా పెరిగిపోతుంది. ప్రభుత్వం ఇచ్చే 200 యూనిట్లు పైగా వాడుతున్నందున కొంతమంది విద్యుత్ బిల్లు మొత్తం చెల్లిస్తున్నారు..

200 యూనిట్లు లోపు విద్యుత్ ఖర్చు చేస్తే ఒక్క రూపాయి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అందరూ కూడా ఎక్కువ కరెంటును వినియోగిస్తున్నారు. దీంతో వేసవికాలంలో తక్కువ కరెంటు వారే వారు కూడా ఎక్కువ కరెంటును వాడుతున్నారు.. అందుకే వీరు కూడా కరెంట్ బిల్లు కట్టాల్సి ఉంటుంది. అదనపు బిల్లు కట్టక తప్పదు; సగటు వినియోగం 150 యూనిట్లు ఉంటే ఇప్పుడు అది 50 యూన్ ట్లు ఎక్కువ కానీ ప్రతి యూనిట్ కి ఏడు రూపాయలు చొప్పున అదనంగా చెల్లించాలి. వేసవి కారణంగా అదనంగా 20% విద్యుత్తు వినియోగం పెరిగినట్లు తెలుస్తోంది.

దీంతో గృహ జ్యోతి ద్వారా లబ్ధి పొందుతున్న వారు కూడా నేడు ఇతరుల మాదిరిగానే పూర్తి విద్యుత్ బిల్లు చెల్లించవలసి ఉంటుంది. ఈ సమ్మర్లో మితిమీరిన విద్యుత్ వాడే వారు ప్రభుత్వ నిర్దేశించిన యూనిట్ కంటే ఎక్కువ యూనిట్లు వాడితే వాడిన ఈ నోటికి మాత్రమే కాకుండా మొత్తం బిల్లు చెల్లించవలసి వస్తుందని తెలుసుకోవాలి. కావున ఎక్కువ కరెంటు వినియోగిస్తున్న వారు కాస్త కరెంటు వినియోగాన్ని తగ్గించుకుంటే ఈ సమస్యను ఉండదు.. ప్రస్తుతం 200 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగించడంతో చాలామంది కరెంట్ బిల్లు మొత్తం చెల్లించవలసి వస్తుంది.

Add Comment