ఉదయం నిద్ర లేవగానే ఈ నాలుగు పనులు అస్సలు చేయకూడదు .చేస్తే అంతే .

ప్రతి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే మనం కొన్ని పనులు చేయటం వలన అది దరిద్రాన్ని ఇస్తుందని పెద్దలు నమ్ముతారు .మనం చేసే పనులు మనకు సిరిసంపదలను కలుగ చేయాలి .కానీ మనం చేయకూడని పనులు చేయడం వలన లక్ష్మి దేవి బయటకు వెళ్ళిపోయి తీవ్ర పేదరికంలో ఉంటామని పెద్దలు అంటూ ఉంటారు .మనం చేసే పనులు మనలో పాజిటివ్ ఎనర్జీని పెంచి మనం చేసే ప్రతి పనిలోనూ విజయాన్ని అందించాలి . మనం తెలిసి తెలియక చేసే పనులు విజయానికి దూరం చేస్తాయి .

అలా చేయకూడని పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .కొంత మంది ఉదయం లేచిన వెంటనే అద్దంలో తమని తాము చూసుకుంటూ ఉంటారు లేదా ఇంట్లో ఒకరిని అదృష్టం భావించి వారి మొహం చూస్తూ ఉంటారు కానీ ఇది మన దర్మాల ప్రకారం నిషేధించబడింది .అద్దంలో మన ముఖం లేదా ఎవరి ముఖం చూడకూడదు .లేచేటప్పుడు భగవంతుని నామాన్ని స్మరిస్తూ కళ్ళు తెరిచి అరచేతులు చూసుకోవాలి అలా చేయడం వలన రోజంతా మంచిగా ఉంటుంది .

మనం పడుకున్నప్పుడు మన శరీరంలో జీవక్రియలు నెమ్మదిస్తాయి .ఉదయాన్నే లేచినప్పుడు అవి వేగం పుంజుకుంటాయి .గుండెపై ఒత్తిడి పడుతుంది .అందుకే లేచేటప్పుడు కుడివైపు తిరిగి లేవాలి .ఉదయం లేచిన వెంటనే గుడి గంటల ధ్వని ,శంకు ధ్వని ,గాయత్రి మంత్రాలు వినడం మంచిది .అలా వినడం వలన మెదడుకు పాజిటివ్ సిగ్నల్స్ అందుతాయి .అందరికీ అందుబాటులో లేనప్పుడు రికార్డ్ చేసుకుని వినవచ్చు .ఉదయం ఉదయం నిద్రలేవగానే నెమలీకలు ,కాలువ పువ్వు ,అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపించేలా పడకగదిలో పెట్టుకోండి .అలాగే భగవంతుని ఫొటో ,బంగారం ,సూర్యుడు ,ఆవు దూడ చూసిన మంచిదే .

అలాగే ప్రతి ఒక్కరూ ఉదయాన్నే నిద్ర లేవాలి .బారెడు పొద్దు ఎక్కిన తర్వాత నిద్ర లేచే ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది .ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్రలేవడం వల్ల ఇల్లు అశుభ్రoగా ఉంటుంది .అందుకే ఇల్లాలు తర్వాత నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసి స్నానం ముగించి దీపం పెట్టాలి .వీలైతే అవుకు ఆహారం పెట్టడం వలన కూడా ఇంటికి మంచి జరుగుతుంది .పక్షులకు ,జంతువులకు కొద్దిగా ఆహారం నీటిని ఇవ్వడం వలన మంచి జరగడంతో పాటు ఏమైనా దోషాలు ఉంటె తొలగిపోతాయి .

కొంత మంది ఉదయం లేచిన వెంటనే న్యూస్ పేపర్ చదువుతుంటారు .అందులో ఎక్కువగా హింసాత్మక ఘటనలు ,నెగిటివ్ వార్తలు ఉంటాయి .ఇవి మన బ్రెయిన్ కు నెగిటివ్ సిగ్నల్స్ పంపి రోజంతా నెగెటివ్గా ఉండేలా చేస్తుంది . అందుకే ఉదయం లేచిన వెంటనే వార్తలు చదవడం అంత మంచిది కాదు . అలాగే కొంతమంది నిద్రలేచిన వెంటనే కాఫీలు ,టీ లు తాగుతూ ఉంటారు దాని వలన శరీరంలో కెఫీన్ పెరుగుతుంది .ఇది గుండెల్లో మంట వంటి అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది .

అందుకే ఉదయాన్నే కాఫీ ,టీ లు తాగకూడదు .ఒకవేళ తాగాల్సి వస్తే బ్రష్ చేసి లేదా నోటిని పుక్కిలించైనా తాగాలి .అలాగే ఉదయాన్నే హింసాత్మక జంతువులను చూడటం లేదా గొడవలు పడటం అంత మంచిది కాదు .ఆ ప్రభావం రోజంతటి మీద ఉంటుంది .కొంత మంది భార్య భర్తలు ఉదయం లేచిన వెంటనే శృంగార కార్యకలాపాల్లో పాల్గొనడం చేస్తుంటారు .ఇలా చేయడం వల్ల దరిద్రం పట్టుకుంటుంది అని అంటారు . ఆ సమయం దేవుడికి పూజలు ,స్మరణకు మాత్రమే ఉపయోగించాలి .