తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు

వాతావరణ పరిస్థితుల కారణంగాఒక్కోసారి గొంతు నొప్పి సమస్య తలెత్తుతుంది. ఇది శరీరంలో డిఫ్తీరియా వ్యాధికి సంకేతం కావచ్చని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొద్ది రోజులుగా పలుచోట్ల ఈ వ్యాధి కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు అభిప్రాయం ప్రకారం.. డిఫ్తీరియా వ్యాధిని గల్గోటు అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి బారీన పడిన వారిలో గొంతు నొప్పితో పాటు,

తేలికపాటి జ్వరం కూడా వస్తుంది. అంతేకాకుండా, డిఫ్తీరియా రోగికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మెడలో వాపు, నిరంతర దగ్గు ఉంటుంది. ఈ వ్యాధి కారణంగా చర్మం రంగు నీలం రంగులోకి మారవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. డిఫ్తీరియా వ్యాధి.. బ్యాక్టీరియా వల్ల వస్తుందని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు.

ఈ బ్యాక్టీరియా గాలిలో ఉంటుంది. ఇవి గాలి ద్వారా శరీరంలోకి ప్రవేశించి గొంతులో ఇన్ఫెక్షన్ కలిగిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ కారణంగా శ్వాసకోశంలో పొర ఏర్పడుతుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత పొర నుంచి బ్యాక్టీరియా రక్తం ద్వారా గుండె, మెదడుకు వ్యాపిస్తుంది.

Add Comment