తర తరాలు తిన్నా తరగని ఆస్తి రావాలంటే ఈ మంత్రాన్ని 11సార్లు జపించండి అస్సలు ఊహించి వుండరు

జీవితంలో అష్టైశ్వర్యాలు,భోగభాగ్యాలు ,సకల సంపదలు కలగాలంటే తరతరాలు సంపదలతో విర జిల్లాలని అంటే, మంత్ర శాస్త్రంలో చెప్పబడిన “సువర్ణ కమల హాసిని” మంత్రాన్ని జపించాలని పండితులు చెబుతున్నారు.మరి ఆ మంత్రం ఎలా జపించాలి ఇప్పుడు మనం తెలుసుకుందాం! మంత్ర శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైన , శక్తివంతమైన మంత్రాలను చెప్పడం జరిగింది, వాటిలో చాలా శక్తివంతమైన మంత్రం” సువర్ణ కమల హాసిని ” మంత్రం.ఈ సువర్ణ కమల హాసినిమంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఎవరైతే ఈ సువర్ణ కమలహాసనీ మంత్రాన్ని 40 రోజులపాటు ,రోజు సాయంకాలం పూట సంధ్య దీపం వెలిగించిన తరువాత, 11 సార్లు చదువుతారో, వారికి 40 రోజులు పూర్తయిన తర్వాత అష్టైశ్వర్యాలు, సిరి సంపదలు కలుగుతాయి.ఐశ్వర్యం, భోగభాగ్యాలు, సకలసంపదలు కలగడంతో పాటుగా ,తరతరాలు తిన్నా తరగని ఆస్తి భవిష్యత్తులో లభించడానికి కూడా ఈ సువర్ణ కమల హాసిని మంత్రం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది .

ఈ మంత్ర జపం ఎలా చేయాలి అంటే ,రోజు సాయంకాలం పూట ఆడవారు పూజామందిరంలో సంధ్యాకాలంలో దీపం పెట్టాలి, అలా దీపం పెట్టిన తర్వాత ఇంటి యజమాని అయినా సరే, ఇంటి యజమానురాలు అయినా సరే ఎవరైనా సరే శ్రీ మహాలక్ష్మి దేవికి కుంకుమతో పూజ చేస్తూ ఈ సువర్ణ కమల హాసిని మంత్రాన్ని 11 సార్లు చదువుకోవాలి.మరి ఆ మంత్రం ఏమిటంటే,” సౌమ్య భోగ్య మహా భాగ్య భోగిని భాగ్య దాయిని సుసౌద కనక ప్రఖ్యా సువర్ణ కమలహాసిని”ఇది చాలా శక్తివంతమైన మంత్రం, ఈ మంత్రాన్ని సంధ్య దీపం పెట్టిన తర్వాత లక్ష్మీదేవి ఫోటో కి కుంకుమతో పూజ చేస్తూ 11 సార్లు చదువుకోవాలి, ఇలా నలభై రోజులపాటు చేయాలి, ఆడవారు మధ్యలో ఇబ్బంది పడితే, ఆ రోజులను వదిలిపెట్టి, 40 రోజుల పాటు ఈ మంత్రాన్ని చదువుకోవచ్చు, 40 రోజులు పూర్తయిన తర్వాత లక్ష్మీదేవి కి ఏ కుంకుమతో అయితే పూజ చేశారో ఆ కుంకుమ ను బొట్టు లాగా పెట్టుకోవాలి.

యజమాని నీ యజమానురాలు ఇద్దరూ కూడా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి,ఇలా చేస్తే విశేషంగా అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలుగుతాయి, 40 రోజులు పూర్తయ్యాక ఒక్కసారి దగ్గర్లో ఉన్న లక్ష్మీ దేవి ఆలయానికి వెళ్లి ,పుష్పాలతో అర్చన చేయించుకోండి, లక్ష్మీదేవిని అర్చించిన ఆ పుష్పాల లో కొన్ని పుష్పాలను తెచ్చి మీ బీరువాలో దాచి పెట్టుకోండి, పుష్పాలు మాడిపోయే వరకూ బీరువా లోనే ఉంచండి, పుష్పాలు వాడి పోయిన తర్వాత వాటిని ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వేయండి ఇలా సువర్ణ కమల హాసిని మంత్రాన్ని 40 రోజులు జపించేటప్పుడు, లక్ష్మీదేవికి పాలు నైవేద్యంగా సమర్పించాలి, ఆ తర్వాత కుటుంబం అంతా కూడా ప్రసాదంగా స్వీకరించాలి, ఇలా ఈ మంత్ర జపం చేస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు తప్పకుండా లభిస్తాయి