దేవుణ్ణి నమ్మిన వారు ఎప్పటికి నాశనం కారు. ఒక్కసారి చూడండి

ఒక ఊరిలో స్మశానం ఉందంటే దానికి అర్థం ఊర్లో అందరూ చనిపోవాలనా? కాదు. అసలు చావులేని ఊరు లేదు, చావులేని దేశాలు లేవు, చావులేని ఇల్లు లేవు, చావులేని వ్యక్తుల కుటుంబాలు కులాలు లేవు. అన్ని కులాలలో చావు మరణాలు కచ్చితంగా ఉన్నాయి. కనుక చచ్చిపోతామని తెలిసి అసలు భయపడకూడదు, మీకు భగవంతుడు భూమి మీద నూకలు అంటే రుణము ఉండేంతవరకు కచ్చితంగా మీరంతా కూడా బతికి తీరుతారు. అందుకని చావు గురించి ఎవరు భయపడకూడదు , మరి ఎవరిని కూడా భయపెట్టకూడదు, మీరు మీరుగా బ్రతకండి. ప్రతి ఒక్కరు టీవీలో కానీ పేపర్లో కానీ న్యూస్ లో కానీ ఫోన్లో కానీ మంచి చెడ్డలు ఏమీ చూడకుండా అవి అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు, కానీ అలా అసలు షేర్ చేయకండి.

మీరు ఒకరికి సాయం చేయకున్న పర్వాలేదు కానీ ఇతరులను అసలు భయపెట్టకండి. ప్రపంచ దేశాల్లో సైంటిస్టులు అంతా కూడా కాశీకి వచ్చి కొన్ని వందల సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడు ఏదేదో అగోచరంగా అక్కడ మట్టిని, రాళ్లను,ఆకులను, గాలిని ,నీళ్లను రీసర్చ్ చేస్తారు. ఇక్కడ ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ ఉత్తరాద్రిలో హిమాలయ పర్వతంలో ఆక్సిజన్ లెవెల్స్ ఎక్కువ. అట్లాంటిది భారతదేశంలో ఆక్సిజన్ లేదు, సిలిండర్ల కష్టం. ప్రకృతిని అంటే కన్నతల్లిని తిట్టారు కన్నతల్లిని అవమానించారు గోవులను అవమానించారు అమాయక ప్రాణులను కనిపించే ప్రతి ప్రాణిని చంపి తినేశారు కాబట్టి కనిపించని ప్రాణి ఇప్పుడు అందరినీ చంపి తినేస్తుంది. ఇందులో తప్పు ఏమీ లేదు, కనిపించేటటువంటి ప్రాణులను చిక్కింది చిక్కినట్లు తినేశారు దోచేసి దోచేసి దాచి పెట్టుకున్నారు ఇది చాలా తప్పు.

అందుకని కనిపించని ఈశ్వరుడునీ తలుచుకుంటే ఆయన మీకు ఆయుష్ బిక్షనిస్తాడు. మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా కూడా మీరు తలకిందులుగా తపస్సు చేస్తున్న సరే ఈశ్వరుడు మీలో ఉన్నాడు అని మీరు నమ్మితే మీకు జీవితం ఉంటుంది. అన్ని జాతులకు అన్ని దేశాలకు అన్ని భాషలకు అందరికీ శివ శివ. ఈ కరోనా చచ్చిపోవాలి కరోనా భయం పోవాలి అంటే హిందువులు హైందవ ధర్మమే కాకుండా ఎవరైనా సరే హిందూ ధర్మాన్ని హైందవ ధర్మాన్ని నమ్మేవారు అందరూ కూడా “హరహర మహాదేవ హర హర మహాదేవ” అంటూ తపస్సు చేస్తూ ఉండండి. హిందూ ధర్మం ఒకరిని చంపమని చెప్పలేదు, ఒకరిని బ్రతికించమని పదిమందిని బ్రతికించమని పదిమంది బాగుంటే పదిమంది మధ్యలో మనం బతికి బాగుండాలి అని శాస్త్రం చెబుతుంది.

హిందూ ధర్మంలో హర హర మహాదేవ అని ఇప్పుడు మూడు కోట్ల మంది మూడు లక్షల కోట్ల మంది అఘోరీలు కూడా అందరూ తపస్సు చేసే రహస్యనామం” హరహర మహాదేవ హర హర మహాదేవ”. మరణ మృత్యువు చిందేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ కాపాడారు ఈశ్వరుడే కాపాడుతాడు. ఆ ఈశ్వరుడి నామమైన హర హర మహాదేవ అని హరహర మహాదేవ అని చెప్తూ ఉండండి ఆక్సిజన్ దొరుకుతుంది అన్నం దొరుకుతుంది ఆరోగ్యానికి మందులు దొరుకుతాయి మీకు ఇది సర్వదా రక్షణగా ఉంటుంది. చదివిన వారికి ఉద్యోగo, చదవని వారికి విద్యాబుద్ధి, ఇల్లు లేని వారికి ఇల్లు, పొలం లేని వారికి పొలం, భార్య లేని వారికి భార్య, బిడ్డ లేని వారికి బిడ్డ, రాజు లేని వారికి రాజు ,మంత్రి లేని వారికి మంత్రి ఇలా ఎవరెవరికి ఏమేమి కావాలో మంత్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. ఏది కావాలో భక్తితో అడిగితే ఈశ్వరుడు కచ్చితంగా ఇస్తాడు.