దేశవ్యాప్తంగా అక్టోబర్‌ 1 నుంచి ఆధార్‌ కొత్త రూల్‌…

13 ఏళ్ల క్రితం యూనిక్ ఐడెంటిఫికేషన్, అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కీలకంగా మారింది. దాదాపు ఆన్లైన్కు సంబంధించిన ఏ అంశమైనా, ఏదైనా అప్లై చేసుకోవాలన్నా కూడా ఆధార్ కార్డు కంపల్సరీ. ఇప్పటికే ఆధార్లో పలుమార్పులు తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా మరోసారి మార్పులు చేయనుంది. అక్టోబర్ ఒకటి నుంచి కొత్త నిబంధనలను అమలు చేయబోతున్నారు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అధికారిక లెక్కల ప్రకారం.

ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లు పైబడిన వారి ఆధార్ ఎన్రోల్మెంట్ దాదాపు 100% పూర్తయింది. దేశవ్యాప్తంగా 134 కోట్ల ఆధార్ రిజిస్ట్రేషన్లు జరిగాయని, ఇందులో అందరూ వయోజనులేనని డీ ఓ ఐ టీ తెలిపింది. ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న వారే కొత్త ఆధార్ నమోదు ప్రక్రియ, అక్టోబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని కేంద్రాలలో మాత్రమే జరుగుతుంది. వచ్చే నెల ఒకటి నుంచి బ్యాంకులో పోస్ట్ ఆఫీస్ లతో సహా, చాలా చోట్ల పనిచేస్తున్న ఆధార్ కేంద్రాలను మూసివేస్తారు. కేవలం జిల్లా బ్లాక్ స్థాయిలో ఎంపిక చేసిన కేంద్రాలలో మాత్రమే నమోదు సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

ఈ కేంద్రాలను ఎక్కడ ప్రారంభించాలో జిల్లా స్థాయి ఆధార్ మౌనిటింగ్ కంపెనీ నిర్వహిస్తుంది. నకిలీ ఆధార్ నమోదు తో దేశభద్రతకు ముప్పు వాటిల్లుతుందనే కారణం తోనే, యుఐడిఏ ఐ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల దేశంలో అక్రమంక నివసిస్తున్న వ్యక్తులు ఆధార్ తీసుకునే ప్రక్రియ చాలా వరకు కంట్రోల్ అవుతుందని భావిస్తుంది. పిల్లల వయసు అయితేలలోపు ఉంటే వారికి వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుల బయోమెట్రిక్ ద్వారా, చిన్న పిల్లలకు ఆధార్ కార్డు జారీ చేస్తున్నారు.