ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లద్ మోదీ ప్రయాణిస్తున్న కారు మంగళవారం కర్ణాటకలోని మైసూరు శివారులో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ప్రహ్లాద్ మోదీ కొడుకు, కోడకలు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ క్రమంలో తాజాగా బుధవారం నాడు మోదీ తల్లి హీరాబెన్.. అస్వస్థతకు గురయ్యారు. ఆమె ఆరోగ్యం విషమించడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించినట్టు జాతీయ మీడియా పేర్కొంది. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఈ ఏడాది జూన్ 18న హీరాబెన్ 100వ పుట్టిన రోజు జరుపుకుంది. వందేళ్ల వయసులోను ఆమె ఎంతో హుషారుగా, చురుగ్గా ఉంటారు. గుజరాత్కు వెళ్లిన ప్రతిసారీ మోదీ.. గాంధీనగర్లోని తన తల్లిని కలిసి యోగక్షేమాలు తెలుసుకుంటారు. అలానే.. తన ప్రతి పుట్టిన రోజు నాడు మోదీ.. తల్లి దగ్గరకు వెళ్లి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో మోదీ.. చివరిసారిగా డిసెంబరు 4న తల్లిని కలిశారు.