గురుసంచారం వలన త్వరలోనే ఈ ఐదు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ..!!

Zodiac Signs : ఏప్రిల్ నెల నుంచి గురు గ్రహ సంచారం జరగబోతుంది. దీంతో ఐదు రాశుల వారికి శుభ ఫలితాలు కలిగనున్నాయి. ముఖ్యంగా మీనా ధనుస్సు సింహ మిధున తుల రాశి వారికి ఏప్రిల్ నెలలో మంచి జరగనుంది. ఏప్రిల్ 22 నుంచి 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అవుతుంది.

1) మీన రాశి వారికి రెండవ స్థానంలో గురు మారాడు. ఏప్రిల్ 22 నుంచి మారడంతో మీనరాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మీన రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వివాహం ఆగిపోయిన వారికి ఈ మాసంలో తప్పకుండా వివాహం జరుగుతుంది. సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. గురు గ్రహ సంచారం వలన ఈ రాశి వారికి అంతా మంచే జరుగుతుంది.

2) అలాగే ధనుస్సు రాశి వారికి ఐదవ స్థానంలో గురు ఉన్నాడు. వీళ్లకు కూడా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ధనస్సు రాశి వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికపరంగా నిలదొక్కుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, సినిమా వాళ్లకు శుభ ఫలితాలు కలగనున్నాయి. కాస్త శ్రమ పడితే అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు.

3) మిధున రాశి వారికి 11వ స్థానంలో గురు ఉన్నాడు. ఫైనాన్షోయల్ పరంగా మంచి పొజిషన్లో ఉంటారు. మొండి బాకీలు పొందుతారు. వివాహ శుభకార్యాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటిని నిర్మించుకుంటారు. బంధువులు, స్నేహితులు సహకారంతో కొన్ని పనులను చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ లు పొందుతారు. ఇలా ఈ రాశికి కూడా గురు గ్రహ జీవితంలో ఎన్నడూ లేని విధంగా శుభ ఫలితాలను పొందుతారు.

4) సింహరాశి వారికి తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నాడు. ఈ రాశి వారు ఫైనాన్షియల్ పరంగా బాగా సంపాదిస్తారు. తల్లి తరపున డబ్బులు వచ్చే అవకాశం ఉంది. తండ్రి సపోర్టు ఉంటుంది. ఉద్యోగులకు శుభ ఫలితాలు కలగనున్నాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందుతారు. మంచి పేరును సంపాదిస్తారు. సింహరాశి వారికి కూడా గురు సంచారం వలన మంచి జరగనుంది.

5) ఇక తులా రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆగిపోయిన సంబంధాలు కుదురుతాయి. ఫైనాన్షియల్ పరంగా మంచి పొజిషన్లో ఉంటారు. ఏప్రిల్ నెలలో ఈ ఐదు రాశుల వారికి మంచి జరగనుంది. అయితే ఈ ఐదు రాశుల స్త్రీలకు ఉద్యోగం చేయాలనే ఆలోచన కలుగుతుంది. కుటుంబాన్ని చక్కగా నడిపిస్తూ సొంత బిజినెస్ ను స్టార్ట్ చేస్తారు.