టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన శర్వానంద్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. పెళ్లి ఎప్పుడని అడిగితే ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటూ వచ్చిన శర్వానంద్ మొత్తానికి మ్యారేజ్కు సిద్ధమైపోయారు. గురువారం (జనవరి 26న) రక్షితా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్తో శర్వా నిశ్చితార్థం ఘనంగా జరిగింది. తెలంగాణ హైకోర్టు న్యాయవాది మధుసూదన్ రెడ్డి కుమార్తె అయిన రక్షిత.. ఏపీ మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణ మనవరాలు కావడం గమనార్హం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్న రక్షిత.. కరోనా వ్యాప్తి తర్వాత స్వదేశానికి వచ్చేశారని తెలుస్తోంది.
ప్రస్తుతం ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని సమాచారం. ఇవాళ కొందరు సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య శర్వానంద్ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు కూడా హాజరయ్యారు.శర్వానంద్ క్లోజ్ ఫ్రెండ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు రావడం విశేషం. భార్య ఉపాసనతో కలసి చెర్రీ ఈ ఫంక్షన్కు విచ్చేశారు. శర్వానంద్, రక్షితతో కలసి చెర్రీ, ఉపాసన దిగిన ఫొటోలు నెట్టింట వైరల్గా మారాయి. ఈ వేడుకలో పింక్ కలర్ షేర్వాణీలో కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చరణ్ హాజరవ్వగా.. ఉపాసన పింక్ శారీలో మెరిసిపోయారు.
అదే సమయంలో సింపుల్ లుక్స్తో శర్వా-రక్షిత జోడీ కూడా ఆకట్టుకున్నారు. ఇకపోతే, ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేక సతమతమవుతున్న శర్వానంద్.. ‘ఒకే ఒక జీవితం’ చిత్రంలో విజయాల బాట పట్టారు. మదర్ సెంటిమెంట్తో తెరకెక్కిన ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. అదే సమయంలో బాక్సాఫీస్ వద్ద కమర్షియల్గానూ సక్సెస్ అయింది. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, సితార బ్యానర్స్లో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు శర్వా. మరికొన్ని కథలను వింటున్నట్లు తెలిసింది. మరి, శర్వానంద్-రక్షితల జంట ఎలా ఉందనేది కామెంట్ల రూపంలో తెలియజేయండి.