దివంగత నటుడు కైకాల సత్యనారాయణ ఆస్తులు ఎంతో తెలుసా?

గత కొంత కాలంగా టాలీవుడ్ లో విషాద ఛాయలు నెలకొంటున్నాయి. కొన్ని నెలల క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు  మరణించగా.. నెల క్రితం సూపర్ స్టార్ కృష్ణ అస్తమించారు. ఈ విషాద ఘటనల నుంచి పరిశ్రమ కోలుకోకముందే మరో దిగ్గజ నటుడు కైకాల సత్యనారాయణ మరణవార్త ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఫిల్మ్ నగర్ లోని తన నివాసంలో శుక్రవారం (డిసెంబర్ 23)న తెల్లవారు జామున 4 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాంతో ఫిల్మ్ నగర్ లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే కైకాలకు సంబంధించిన ఆస్తుల గురించి వార్తలు పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. కైకాల ఆస్తులు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.

కైకాల సత్యనారాయణ .తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ నటుల్లో అగ్రగణ్యుడు. ఎన్టీఆర్ తో సమానంగా సాంఘీక, జానపద చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నారు. తనదైన విలనిజంతో టాలీవుడ్ లో ముద్రవేసుకున్నారు. ముఖ్యంగా యముడు పాత్ర అంటే అభిమానులకు వెంటనే గుర్తుకు వచ్చే పేరు కైకాల. అగ్రహీరోల అందరి సరసన విలన్ గా చేసి.. నట సార్వభౌమునిగా కీర్తి గడించారు. సుమారు 776 సినిమాల్లో నటించి రికార్డ్ నెలకొల్పారు. గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న కైకాల.. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. కైకాల ఆస్తుల వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కైకాలకు హైదరాబాద్ తో పాటుగా చెన్నైలో సొంత ఇళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఆయన దగ్గర రెండు ఖరీదు అయిన కార్లు ఉన్నాయి. వాటిల్లో ఒకటి మెర్సిడెజ్ బెంజ్ GLC క్లాస్. దీని ధర అక్షరాల 67 లక్షలు. ఇక మరో కారు ఇన్నోవా క్రిస్టా.. దీని ధర 29 లక్షలు అని సమాచారం.

ఇక కైకాలకు హైదరాబాద్ లోని గచ్చిబౌలి ప్రాంతంలోని నాగార్జున రెసిడెన్సీలో ఓ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తోంది. దాని ఖరీదు రూ.1.47 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక కైకాల ఆస్తుల విలువ దాదాపు రూ.30 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరికొంత సమాచారం ప్రకారం ఇంత కన్నా ఎక్కవగానే ఆయన ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కైకాల మరణం సినీ పరిశ్రమకి తీరని లోటు. కైకాల మరణానికి సినీ, రాజకీయ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలుపుతున్నారు. హీరో బాలకృష్ణ సంతాపాన్ని తెలుపుతు కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. శనివారం జుబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.