దసరాలోపు ఈ 7వస్తువుల్లో ఏ ఒక్కటి ఇంటికి తెచ్చుకున్నా….

దసరా లోపు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే చాలు ,కటిక పేదవారైనా సరే ధనవంతులుగా మారిపోతారు ఆ ఒక్కటి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందువల్ల దసరా లోపు ఈ ఒక్కటి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవం చేస్తుంది, ఇంకా మీ ఇంట సిరులు కురిపిస్తుంది మీరు ఎంత పేద స్థితిలో ఉన్న మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది, మరి దసరా లోపు ఇంటికి ఏం తెచ్చుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన కష్టానికి దైవ శక్తి తోడైతే అన్ని విజయాలే వరిస్తాయి. మరి లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి. అప్పుడు ఆ దేవత సంతోషించి మన ఇంట సిరులు కురిపించి అందేలంఎక్కిస్తుంది. వచ్చే విజయదశమి అంటే దసరా లోపు ఈ ఒక్కటి ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి మనల్ని తప్పక అనుగ్రహిస్తుంది.

పూర్వపు రోజుల్లో డబ్బులను లెక్కించే వస్తువులు గవ్వలేనట, పూర్వం రోజుల్లో ఎవరి వద్ద ఎన్ని గవ్వలు ఉంటే వారు అంతటి ధనవంతులు అనేవారు. వారు గవ్వలను లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించేవారు ఇప్పటికీ గవ్వలను హిందువులు పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండి ఉద్భవించింది అందుకనే లక్ష్మీదేవికి గవ్వలంటే చాలా ఇష్టం కాబట్టి గవ్వలను ఈ దసరా లోపు ఇంటికి తీసుకువచ్చి పూజ గదిలో గల్లా పెట్టెలో బీరువాలలో ఉంచాలి. గవ్వలను పూజ గదిలో ఉంచి పూజించడం వల్ల అక్కడ లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటారు, అలాంటి ఇంటిని లక్ష్మీదేవి అనుగ్రహించి సిరులు కురిపిస్తుంది.

గోముఖ శంఖం గోమాత అయిన కామధేను యొక్క స్వరూపం. మీ కోరికలు తీరాలంటే గోముఖ శంఖం తీసుకువచ్చి మీ ఇంట్లో పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటముందు ఉంచి ధూప, దీప, నైవేద్యాలతో పాటించండి. అదేవిధంగా లక్ష్మీదేవికి ప్రతిరూపమైన తామరగింజలను ఇంటికి తీసుకువచ్చి మన ఇంట్లో పూజ గదిలో ఉంచే పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలిగేలా లక్ష్మీదేవి దీవిస్తుంది. దసరా లోపు గురిగింజలను తీసుకువచ్చి ఇంట్లో పూజ గదిలో బీరువాలో గల్లా పెట్టెలలో ఉంచండి ఇలా చేస్తే మీరు ఏ పని తలపెట్టిన విజయం వరిస్తుంది. ఇవి ధనాన్ని ఆకర్షిస్తాయి మిమ్మల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తాయి.