కోడిగుడ్లు తిన్నాక ఇవి అస్సలు తినకూడదు….

కోడిగుడ్లు తిన్నాక ఇవన్నీ అసలు తినకూడదు ఎందుకంటే మనం ప్రతిరోజు ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునే వరక రకరకాల ఆహారాలను తీసుకుంటూ ఉంటాం. వాటిలో వెజ్, నాన్వెజ్, స్నాక్స్ అంటూ ఇలా రక రకాల ఆహారాలు ఉంటాయి. అయితే కొన్ని రకాల ఆహారాలను మాత్రం అస్సలు కలిపి తినకూడదు, అంతేకాదు ఆహార పదార్థాలను తిన్న వెంటనే కొన్ని పదార్థాలను తినకూడదు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ విషయంలో ఎలాంటి ఆహార నియమాలను పాటించాలి తెలుసుకుందాం! చికెన్ ,పాలు ,మటన్ కలిపి తీసుకోకూడదు, చికెన్ తిన్న తర్వాత పాలను అస్సలు త్రాగకూడదు. అంతేకాకుండా పాలు త్రాగిన తర్వాత కూడా చికెన్ తినకూడదు, ఎందుకంటే రెండిటిలోనూ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి కాబట్టి అవి జీర్ణమయ్యేందుకు చాలా సమయం పడుతుంది.

ఇలాంటి పరిస్థితుల్లో కొందరికి అజీర్తి ,గ్యాస్, ఎసిడిటి విరేచనాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చికెన్ ,పాలు, మటన్ కాంబినేషన్ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. పాలు తాగిన తర్వాత పెరుగు, జున్ను, కోడిగుడ్డు, చేపలు, వేడిగా ఉండే పానీయాలను తీసుకోకూడదు. బీన్స్ తో జున్ను, పెరుగు ,కోడి గుడ్లు, చేపలు, పండ్లు తీసుకోరాదు. ముల్లంగి తో గాని అరటి పండ్లు ఎండు ద్రాక్ష తో కానీ పాలను తీసుకోకూడదు. పుచ్చకాయతో పదార్థాలు నీళ్లు, వేపుళ్లు తీసుకోరాదు. వేడి పానీయాలతో మామిడి పండ్లు, జున్ను , చేపలు, పెరుగు అంటే ఆహార పదార్థాలను తీసుకోకూడదు. నిమ్మకాయ వంటి పుల్లని పండ్లతో దోసకాయలు పాలు టమాటా పెరుగు వంటి ఆహార పదార్థాలను తీసుకోవద్దు. కోడిగుడ్డుతో చేపలు, పాలు, పెరుగు తీసుకోరాదు.

చిరు ధాన్యాలు, గింజలు వంటి వాటితో పండ్లను తినరాదు. తేనే, నెయ్యి కాంబినేషన్ కూడా మంచిది కాదు. పాలు, అరటిపండు కలిపి తీసుకోరాదు, 1 తీసుకున్న తర్వాత కూడా మరొకదాన్ని తీసుకోకూడదు, కనీసం గంట సమయం వేచి ఉండాలి ఆ తర్వాతనే తీసుకోవాలి. ఈ ఫుడ్ కాంబినేషన్ లో తీసుకుంటే జీర్ణ సమస్యలు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా అజీర్ణం, మలబద్ధకం ,విరేచనాలు వంటి వాటితో ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉంటాయి. .అలాగే తలనొప్పి, గ్యాస్ ,వికారం, కడుపు ఉబ్బరం ,కడుపు నొప్పి, నిద్రపట్టకపోవడం, మత్తుగా ఉండడం, చర్మంపై దురదలు, దద్దుర్లు రావడం ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి ఈ ఫుడ్ కాంబినేషన్లను తీసుకోవద్దని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు